Vijayashanti : కామారెడ్డి అసెంబ్లీపై నా పోటీని పార్టీ నిర్ణయిస్తుంది..! బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి : విజయశాంతి

కేసీఆర్ అభ్యర్థుల జాబితా విడుదల చేయడంతో తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైంది.. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ నాయకురాలు విజయశాంతి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. కామారెడ్డి అసెంబ్లీపై తన పోటీని పార్టీ నిర్ణయిస్తుందని తెలిపారు. రెండు రోజులుగా పాత్రికేయ మిత్రులు, మీడియాలో వస్తున్న వార్తల ప్రసారాలపై అడుగుతున్న ప్రశ్నలకు నా సమాధానం ఇంతే..

బీజేపీ కార్యకర్తలం ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించడం మాత్రమే మా విధానం.. ఏది ఏమైనా కామారెడ్డి, గజ్వేల్ రెండు నియోజకవర్గాలలో బీజేపీ గెలుపు, తెలంగాణ భవిష్యత్తుకు తప్పనిసరి అవసరం. ఇది ప్రజలకు తెలియపర్చటం తెలంగాణ ఉద్యమకారుల అందరి బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.