Senior Journalist Imandhi Ramarao : ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాల మీద హద్ధులు దాటి విరుచుకుపడే నేతలలో మంత్రి రోజా, కోడాలి నానీ, ప్రేర్ని నానీ, ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటివారు ముందుంటారు. విపక్షాల మీద దాడి విషయంలో వీరికి ఎవరు సాటిరారు. తాజాగా జరిగిన అమరావతి పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం గురించి ఐటి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ టీడీపీ గెలిచిన ఒకదానికే వరల్డ్ కప్ కొట్టినట్లు ఫీల్ అవుతున్నారంటు కామెంట్స్ చేసారు. ఇలా ఎప్పటికప్పుడు విపక్షాల మీద విరుచుకుపడుతున్న, ఇక వైసీపీ మహిళ నేతలలో రోజా ముందుంటారు. ఇక ఆమె జనసేన అధినేత మీద విరుచుకుపడే విధానం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామరావు మాట్లాడారు.
నాగబాబు తో అన్నేళ్లు కలిసి పనిచేసావ్ మరచిపోయావా…
ఇమంది రామారావు గారు మంత్రి రోజా తీరు గురించి మాట్లాడుతూ ఆమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే అయన కుటుంబం గురించి కూడ విమర్శలను చేస్తుంటారు. ఒకప్పుడు జబర్దస్త్ లో నాగబాబు తో కలిసి పనిచేసి అపుడు నాగబాబు గారు అంటూ పిలిచిన రోజా ఇపుడు జనసేన పార్టిని విమర్శించడం కోసం ఏకవచనం తో మాట్లాడుతుంది.
ఇక చిరంజీవి గారింటికి వెళ్లి అతిద్యం తీసుకుంటుంది మళ్ళీ వారినే విమర్షిస్తుంది. ఆ విమర్శలకు కూడ స్థాయి అలాగే హద్దు ఉండాలి. అవేవి లేకుండా మాట్లాడేస్తుంది రోజా అంటూ ఫైర్ అయ్యారు ఇమంది రామారావు. జగన్ మెప్పు, ప్రాపకం కోసం హద్ధులు మీరు కామెంట్స్ చేస్తే భవిష్యత్ ఏమిటనేది రోజా ఆలోచించడం లేదంటూ ఆయన అభిప్రాయపడ్డారు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…