Senior Journalist Narra Vijay : తెలంగాణ లో అధికార పార్టీ బిఆర్ఎస్ అపుడే ఎన్నికల బరిలో నిలవబోయే అభ్యర్థుల జాబితాను విడుదల చేసి ఒక్కసారిగా షాకిచ్చింది. అంతేకాకుండా తెలంగాణ రాజకీయాన్ని హీటక్కించింది. ఒకవైపు సీఎం అభ్యర్థి ఎవరని కాంగ్రెస్, బిజెపి మల్లగుల్లాలు పడుతుంటే ఏకంగా బిఆర్ఎస్ అభ్యర్థులను 119 నియోజకవర్గాలకు ప్రకటించి ఆశ్చర్యపరిచింది. ఇక ఈసారి సీఎం కెసిఆరే మరోసారి తమ సీఎం అభ్యర్థి అంటూ ఆ పార్టీ క్లారిటీ కూడ ఇచ్చేసింది. అయితే ఈసారి కెసిఆర్ గజ్వేల్ నుండి మాత్రమే పోటీ చేయకుండా కామారెడ్డి నుండి పోటీ చేస్తున్నారు. ఒకే నాయకుడు రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేయడం కొత్త కాకపోయినా మూడో టర్మ్ కూడ ముచ్చటగా గెలవాలని చూస్తున్న గులాబీ బాస్ వ్యూహం ఏమిటన్నది ఇపుడు చర్చ. ఇక ఈ విషయం గురించి సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ ఆయన విశ్లేషణ అందించారు.
కెసిఆర్ కామారెడ్డి నుండి బరిలోకి…
ముఖ్యమంత్రి కెసిఆర్ మూడోసారి ముచ్చటగా సీఎం అవ్వాలని తన వ్యూహ రచనకు పదును పెట్టారు. ఎన్నికలకు ఇంకా 50 రోజుల పైనే సమయం ఉన్న అపుడే అభ్యర్థులను ప్రకటించి రాజకియంగా తానేంటో మరోసారి చూపించారు. అయితే ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ నుండి కాకుండా ఆయన ఈసారి కామారెడ్డి నుండి కూడ పోటీ చేస్తున్నారు. దీనికి ఆయన అక్కడి నేతల ఒత్తిడి వల్లే పోటీ చేస్తున్నట్లు చెప్తున్నా వెనుక వేరే మతలబు ఉందని నర్రా విజయ్ అభిప్రాయపడ్డారు.
కామారెడ్డి నియోజకవర్గం లోనే కెసిఆర్ తల్లి గ్రామం ఉండటం ఒక కారణం అయితే మరో కారణం కామారెడ్డి నుండి కెసిఆర్ బరిలోకి దిగితే అటు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీం నగర్ ఈ మూడు జిల్లాల్లోనూ ఆ ప్రభావం ఉంటుంది . అందుకే ఈ నిర్ణయం కెసిఆర్ తీసుకుని ఉండవచ్చు అంటూ విజయ్ తెలిపారు. సిఎం కి గజ్వేల్ లో గెలవడం నల్లేరు మీద నడకే అయినా కామారెడ్డి ఎంచుకోవడం వెనుక రాజకీయా ప్రయోజనం ఉందని తెలిపారు. అయితే ప్రతిపక్షలు ఈ సారి కెసిఆర్ గజ్వేల్ లో గెలవడం కష్టమని కెసిఆర్ కు తెలిసిపోయింది అందుకే కామారెడ్డికి షిఫ్ట్ అయ్యాడు అంటూ విమర్శలను గుప్పిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…