Vaishnavi Chaitanya: బేబీ సినిమా ద్వారా నటిగా ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారారు నటి వైష్ణవి చైతన్య.సినిమాలలోకి రాకముందు పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ఉన్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే హీరోయిన్ గా ఈమె నటించిన మొదటి సినిమా బేబీ ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వైష్ణవి చైతన్య చిన్నప్పటి నుంచి తాను పడినటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు. తాను పదో తరగతి చదువుతున్న సమయంలోనే కుటుంబ బాధ్యతలను తీసుకున్నానని తెలిపారు. నాకు తెలిసినది డాన్స్ ఒక్కటే కుటుంబ పోషణ కోసం తాను పలు ఈవెంట్స్ లో డాన్స్ చేస్తూ డబ్బులు సంపాదించానని తెలిపారు.
ఇలా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని ముందుకు నడిపించామని వైష్ణవి చైతన్య తెలిపారు.ఇక ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కొందరు స్టార్స్ వాష్ రూమ్ కోసం తమ క్యారవాన్ ఉపయోగించుకుంటామన్న కూడా వీలు లేదని ఎంతో అవమానకరంగా మాట్లాడారు.ఒకరోజు వాష్ రూమ్ లో బట్టలు చేంజ్ చేసుకోవడం చూసిన మా అమ్మ ఎంతో బాధపడి మనకు ఇవన్నీ వద్దు అంటూ ఎంతో బాధపడింది అయితే నాకు ఆ క్షణం మరింత పట్టుదల పెరిగింది అని తెలిపారు.
ఈ విధంగా చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుతాను ఈ స్థాయికి వచ్చానని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.ఇక బేబీ సినిమా సమయంలో కూడా తాను ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని నిర్మాత తెలియజేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈమె అనుకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అలాగే ఈమె కలలు నెరవేరాయని చెప్పాలి. ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయని వార్తలు వచ్చినప్పటికీ ఏ ఒక్కటి అధికారికంగా ప్రకటించలేదు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…