జయసుధకు ఏమైంది.. ఇలా ఎందుకు మారింది.. ఫోటో వైరల్..

సినీ పరిశ్రమలో జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు సహజనటిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె అసలు పేరు సుజాత. ఆమె మద్రాసులో జన్మించినా.. ఆమె మాతృభాష తెలుగే అని చెప్పుకుట్టుంది. పండంటి కాపురం సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ నటి.. తెలుగు, తమిళం, కన్నడం, మళయాలం భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. దాదాపు 300 కు పైగా సినిమాల్లో నటించారు.

1985లో ఆమె నితిన్ కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొదటి కొడుకు పేరు నిహార్, రెండో కుమారుడు పేరు శ్రేయంత్ ఉన్నారు. ఇటీవల అనారోగ్యముతో బాధపడుతూ వైద్య సహాయములేని పిల్లలకు సహాయము చెయ్యడానికి ఈమె ఒక ట్రస్టును కూడా ప్రారంభించారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాదు ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే.అయితే ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఆమె ఫొటో ఒకటి వైరల్ గా మారింది.

దానిని చూసిన ప్రతీ ఒక్కరూ జయసుధ ఎంటి ఇలా మారారు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈమె ఇండియాలో లేరు. అమెరికాలో ఉన్నారు. అక్కడే కొన్ని రోజులుగా ఉంటున్నారు. ఒకప్పుడు వరస సినిమాలో బిజీగా ఉండే ఈమె.. కొన్ని నెలలుగా ఎందుకో సినిమాలకు దూరంగానే ఉంటున్నారు.

అయితే ఇటీవల ఆమె కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. నిహార్ కపూర్ గ్యాంగ్‌స్టర్ గంగరాజు అనే సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. ఒకప్పుడు ఎంతో గ్లామరస్ గా కనిపించిన ఆమె ప్రస్తుతం ఇలా మారడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.