General News

హైవే పక్కనే ఆ రెండు గ్రామాలు ఉన్నాయి.. కానీ వాళ్ల ఊర్లకు మాత్రం రోడ్డు లేదు.. ఎక్కడంటే..

దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సాంకేతిక రంగం నుంచి మొదలుకొని.. ఎన్నో రంగాల్లో అద్బుతంగా రాణిస్తుంది.. అప్పటి భారత ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన అనే పథకాన్ని 2000 సంత్సరంలో ప్రేశపెట్టారు. దాని ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే.. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉండాలని.

మారు మూల పల్లెల దగ్గర నుంచి గిరిజనులు ఉండే.. ప్రాంతాల వరకు రోడ్లను అనుసంధానం చేయలనేది లక్ష్యం. అయితే అప్పటి నుంచి రోడ్డు లేని గ్రామం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గం చీకలబైలు పంచాయతీ పరిధిలోని ఎగువ దొనబైలు, దిగువ దొనబైలు గ్రామాలకు ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేదు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.

రోడ్డు సౌకర్యం లేకుండా ఉన్న ఊర్లు కూడా ఉన్నాయా అంటూ నెటిజన్లు నోరెళ్లపెడుతున్నారు. అది మన తెలుగు రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ గ్రామాలకు హైవే రోడ్డు కూత వేటు దూరంలో ఉండటం గమనార్హం. ఈ రెండు గ్రామాల్లో 70 కుటుంబాలు నివసిస్తున్నాయి. హైవే నుంచి వాళ్ల ఊరికి వెళ్లాలంటే మాత్రం రోడ్డు సౌకర్యం లేదు.

అధికారులను ఎన్నో సంవత్సరాల నుంచి వేడుకుంటున్నా స్పందించడం లేదంటూ వాపోతున్నారు. మదనపల్లె-బెంగళూరు జాతీయ రహదారికి పక్కనే ఉన్న చీకలబైలు కొండలపై ఈ రెండు గ్రామాలున్నాయి. వీళ్ల గ్రామాలకు వెళ్లాలంటే మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. అధికారులు తమ సమస్యను పట్టించుకొని రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

15 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

16 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

23 hours ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

24 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago