Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

Agneepath Scheme: అగ్నిపథ్ గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా యువతను సైన్యంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు.భారత సైన్యాన్ని మరింత శక్తివంతం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?
Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ పథకంలో భాగంగా 17.5 నుంచి 21 సంవత్సరాలు వయస్సున్న యువకుల ను ఈ పథకం ద్వారా సైన్యంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చే అనంతరం మూడున్నర సంవత్సరాల పాటు సర్వీస్ లో ఉంచుతారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 25% మందిని శాశ్వత కమిషన్ లో పనిచేయడానికి అవకాశం కల్పిస్తారని వెల్లడించారు. తొలి సంవత్సరం రూ.4.76 లక్షల ప్యాకేజీ అందిస్తారు. వీరిని అగ్నివీరులుగా అభివర్ణిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Agneepath Scheme: అగ్నిపథ్ స్కీమ్ అంటే ఏమిటి.. అగ్నిపథ్ స్కీమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రకాష్ నారాయణ?

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై ప్రతిపక్షాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ పలు చోట్ల ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ పథకం గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయానని,దేశం రాష్ట్రం అభివృద్ధి కోసం కాకుండా వచ్చే ఎన్నికలలో అధికారం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. ఏదైనా ఒక పథకం గురించి అధికారపక్షం నిర్ణయం తీసుకుని ఆ పథకం గురించి ప్రతిపక్షం మరుక్షణమే తీవ్రస్థాయిలో ఆందోళనలు చేయడం సర్వసాధారణం అయింది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర రాజకీయాలు జాతీయ స్థాయిలో రాజకీయాలు కూడా ఇదే ధోరణిలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం భారత దేశ సైనిక దళాలను పెంచడం కోసం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. అయితే మనకు ఎంత సైన్యం ఉన్నారు అనేది ముఖ్యం కాదు ఆ సైన్యం ఎంత సమర్థవంతంగా ఉన్నారనేది ముఖ్యం అని జయప్రకాశ్ నారాయణ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇలా అధిక మొత్తంలో సైన్యాన్ని తీసుకొని వారికి అధిక స్థాయిలో జీతభత్యాలు చెల్లిస్తూ సరైన శిక్షణ లేకపోతే కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎన్నికల కోసమే ఉద్యోగ ప్రకటనలు…

అమెరికా వంటి దేశాలలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ వారి దగ్గర అధునాతనమైన సాంకేతిక శక్తిని కలిగి ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు ఉండటం వల్ల దేశ భద్రత మరింత పటిష్టంగా ఉంది. మనదేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలను విడుదల చేస్తూ వారికి నెలవారి జీతాలు ఇస్తున్నారు తప్ప ఎక్కడ ఏ స్థాయిలో ఉద్యోగుల అవసరం అనే విషయం గుర్తించలేదు. కేవలం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ఎన్నికల కోసం ఆలోచన చేస్తూ ఇలాంటి ధోరణిని ఎంపిక చేసుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఒక పై అధికారికి డ్రైవర్ బంట్రోతు అందరూ ఉన్నారు అధికారికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు కానీ దేశ ప్రజలకు సేవ చేసేవాళ్ళు లేరని తెలిపారు.

మన దేశంలో సరైన విద్య, సరైన ఆరోగ్యం లేదు. కొన్ని ప్రాంతాలలో శాంతి భద్రత కూడా లేదు.వీటిపై దృష్టి పెట్టకుండా కేవలం వచ్చే ఎన్నికలపై దృష్టి పెడుతూ ప్రధాన మంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనకు ఎంతమేర సైన్యం అవసరం అనే విషయాన్ని ఆలోచించకుండా ఒకేసారి లక్షలు ఉద్యోగ ప్రకటన ఇస్తే వారికి తదుపరి ఎన్నికలలో ప్రయోజనకరంగా ఉంటుందనేది వారి ఉద్దేశమని ఈయన ఈ అగ్నిపథ్ స్కీమ్ గురించి తన అభిప్రాయాలను తెలియజేశారు.