Sumanth Ashwin : వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఒక్కడు వంటి వరుస బ్లాక్ బస్టర్స్ సినిమాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారిన ఎమ్ ఎస్ రాజు వరుసగా మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుని రికార్డు సృష్టించారు. ఆయన బ్యానర్ సుమంత్ ఆర్ట్స్ లో ఎంతో మంది హీరోలను టాప్ హీరోలుగా చేసారు. ఇక ఎమ్ ఎస్ రాజు గారి తనయుడు సుమంత్ అశ్విన్ ను 2012 లో సినిమాల్లోకి హీరోగా పరిచయం చేసారు. తూనీగ తూనీగ సినిమాతో పరిచయమైన సుమంత్ అశ్విన్ స్వయంగా ఎమ్ ఎస్ రాజుగారే దర్శకత్వం వహించినా ఆ సినిమా పెద్దగా జనానికి ఎక్కలేదు.
ఆర్థికంగా నష్టపోయాం.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి…
సుమంత్ అశ్విన్ నటించిన మొదటి సినిమా ప్లాప్ అయ్యాక లవర్స్ సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో ‘అంతకు ముందు ఆ తరువాత’ సినిమాతో మంచి నటన కనబరిచాడు. ఇక కేరింత, హ్యాపీ వెడ్డింగ్, ఇది మా కథ, కొలంబస్ వంటి సినిమాలలో నటించినా పెద్దగా అతని కెరీర్ కు ఉపయోగపడలేదు. ఇక తాజాగా ‘సెవెన్ నైట్స్ సిక్స్ డేస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఎమ్ ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సుమంత్ తన తండ్రి గురించి తన సినిమా కెరీర్ గురించి మాట్లాడారు. వరుస ప్లాప్ ల వల్ల ఆర్థికంగా తన తండ్రి నష్టపోయారని, దీంతో చెన్నై లో ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు.
చాలా కాలం తరువాత ఎమ్ ఎస్ రాజు గారు దర్శకత్వం వహించిన చిత్రం డర్టీ హరి. ఈసినిమా యువతరాన్ని ఆకట్టుకునేలా చేసిన చాలా బోల్డ్ అట్టెంప్ట్ ఫిల్మ్ అనే చెప్పాలి. ఈ సినిమా తన తండ్రి ఎంత ట్రెండిగా సినిమా తీయగాలడో నిరూపించిందని ఓటీటీ లో ఈ సినిమా చాలా మందికి నచ్చిందని చెప్పారు.
అయినా కూడా ఆయన ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా చాలా కూల్ గా ఆలోచిస్తారని చెప్పాడు. ఇక సోషల్ గా చురుగ్గా ఉండాల్సిన పని లేదని ఇన్ని రోజులు అనుకునే వాడినని కానీ యంగర్ జనరేషన్ కి దగ్గరవ్వాలంటే ప్రొమోషన్స్ బాగుండాలని అర్థమైందని చెప్పారు. మహేష్ మీ సినిమా ప్రమోషన్స్ కి పిలిస్తే వస్తారా అని యాంకర్ అడిగితే.. అప్పుడు మేము పిలిచినపుడు ఆయన అందుబాటులో లేరు.. కానీ అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వస్తారు అంటూ చెప్పారు. వెంకటేష్ గారు నా సినిమాల ప్రమోషనుకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటూ వివరించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…