బిగ్ బ్రేకింగ్.. బిగ్ బాస్ 5 హౌస్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ వీరే..!

తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5కు రంగం సిద్ధ‌మైంది. రేపటి నుంచి ఈ తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో మరోసారి సందడి చేయనుంది. ఇప్పటికే గత నాలుగు సీజన్లతో ఎంతో మంచి రేటింగ్స్ తో దూసుకుపోయిన ఈ రియాల్టీ షో రేపు సాయంత్రం ప్రేక్షకులను అలరించనుంది.

గత రెండు సీజన్ల నుంచి బిగ్ బాస్ రియాల్టీ షోకు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్ 5 కి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించి హ్యట్రిక్ కొట్టనున్నాడు. అయితే ఇప్పటికే ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి వార్తలు వినిపించినప్పటికీ తాజాగా ఫైనల్ లిస్టు ఇదేనంటూ ఓ లిస్టు ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కంటెస్టెంట్లంతా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని తాజ్ డెక్కన్, మారియట్ హోటళ్లలో క్వారంటైన్ లో ఉన్నారు. వీరంతా ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫైనల్ కంటెస్టెంట్ల విషయానికి వస్తే..

డాన్స్ మాస్ట‌ర్ యాని, యాంక‌ర్ ర‌వి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జ‌శ్వంత్‌, యూట్యూబర్ సరయు, నటరాజ్ మాస్టర్, నటి శ్వేతా వ‌ర్మ, సీరియ‌ల్ న‌టి ప్రియ‌, ల‌హ‌రి, సీరియ‌ల్ హీరో మాన‌స్‌, ఆర్‌.జె.కాజ‌ల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సింగ‌ర్ శ్రీరామ‌చంద్ర‌, యాక్ట‌ర్ విశ్వ కూడా ఈ బిగ్‌బాస్ 5లో పాల్గొన‌బోతున్నారంటూ ఈ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంతమంది ఉన్నారనే విషయం తెలియాలంటే.. రేపటి వరకు ఆగాల్సిందే.