కిడ్నీలో ఏర్పడిన రాళ్లను సులభంగా తొలగించుకోవడానికి మంచి చిట్కాలు?

కిడ్నీలో ఏర్పడిన రాళ్లను సులభంగా తొలగించుకోవడానికి మంచి చిట్కాలు?

కిడ్నీలో రాళ్ల సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు.కిడ్నీ స్టోన్స్ సమస్య నుండి బయట పడాలంటే ఈ క్రింద చెప్పినట్లు చేస్తే ఉపశమనం పొందొచ్చు అని వైద్యులు, ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

* కిడ్నీలో రాళ్ళు కరగాలంటే ఒక స్పూన్ నిమ్మ రసం తేనె మిశ్రమాన్ని క్రమం తప్పకుండా ఆరునెలలు తీసుకోవడం వలన జిద్నీ లో రాళ్ళు నివారించబడటమే కాకుండా కిడ్నీ రాళ్ళు ఉంటె కరిగిపోతాయి..

*నిమ్మ రసంలో సైంధవ లవణం కలుపుకొని త్రాగడం వలన మూత్ర పిండాలలో ఏర్పడిన రాళ్ళు కరిగిపోతాయి

*పుచ్చకాయలో నీరు ,పొటాషియం ఎక్కువగా ఉండటం వలన పుచ్చకాయ జ్యూస్ ప్రతి రోజు తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి

*నీరు నిమ్మరసం మిశ్రమంలో కొంచెం పంచదార కలుపుకొని ప్రతి రోజు ఉదయం సాయంత్రం తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయట

*కిడ్నీలో రాళ్ళు నివారణకు వారంలో ఒకసారి ఖాళి కడుపుతో దానిమ్మ జ్యూస్ కాని దానిమ్మ గింజలు కాని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది


*ప్రతి రోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు సేవించడం వలన కిడ్నీ స్టోన్స్ తో పాటు ఇతర వ్యర్ధాలు కూడా తొలిగిపోతాయి

*కొత్తిమీర ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పది నిమిషాల పాటు మరిగించాలి.ఆ రసాన్ని వడకట్టి ఒక సీసాలో పోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ప్రతి రోజు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్ళు బయటకు పోతాయి,కిడ్నీలను శుభ్రపరచడానికి కొత్తిమీర సహజమైన ఔషదం అని అంటున్నారు వైద్యులు..

*అలోవేర జ్యూస్ త్రాగడం వలన మూత్ర పిండాలలో రాళ్ళు ఏర్పడవని చెబుతున్నారు

అదే విధంగా రోజు ఐదు లీటర్లకు తక్కువ కాకుండా నీటిని తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయట.అందరికి ఉపయోగపడే ఈ సమాచారం షేర్ చేయండి..