మానవత్వం మరోసారి మంటగలిసింది. ఆర్థిక సంబంధాలే తప్ప.. మానవ సంబంధాలకు తావే లేదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్ కూకట్ పల్లి వెంకటేశ్వరకాలనీలో జరిగిన ఘటన అందరి హృదయాలను కలిచివేసింది. కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ అనే ఆరో తరగతి చిన్నారి డెంగ్యూతో నిన్న రాత్రి చనిపోయాడు. అసలే కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓనర్ ఇంట్లోకి తీసుకురావొద్దంటూ అడ్డుకున్నాడు. దీంతో చేసేది లేక వర్షంలోనే బిడ్డ శవంతో గడిపారు కుటుంబ సభ్యులు. ఇంటి ముందు ఉన్న అరుగుపైనే చిన్నారిని ఉంచి.. తడవకుండా ఉండేందుకు ఈ కుటుంబ సభ్యులే దుప్పట్లతో అడ్డం ఉన్నారు. ఓ వైపు భారీ వర్షం – చనిపోయిన ఇంటి కుటుంబ సభ్యులను ఓనర్ తోపాటు.. చుట్టుపక్కల ఎవరూ కూడా ఆదుకోవటానికి ముందుకు రాకపోవటంతో రాత్రంతా నిస్సాహాయ స్థితిలో ఉన్నది ఆ కుటుంబం. ఉదయం విషయం తెలుసుకున్న కాలనీ వాసులు.. అప్పటికప్పుడు బాక్స్ తీసుకొచ్చి చిన్నారి మృతదేహాన్ని అందులో ఉంచారు. కాలనీవాసులు కొందరు ఆర్థికసాయం చేశారు. అంత్యక్రియలకు సహకారం అందించారు. ఇంటి ఓనర్ తీరుపై మండిపడుతున్నారు స్థానికలు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…