మానవత్వం మరోసారి మంటగలిసింది. ఆర్థిక సంబంధాలే తప్ప.. మానవ సంబంధాలకు తావే లేదని మరోసారి నిరూపితమైంది. హైదరాబాద్ కూకట్ పల్లి వెంకటేశ్వరకాలనీలో జరిగిన ఘటన అందరి హృదయాలను కలిచివేసింది. కాలనీలో నివాసం ఉంటున్న సురేష్ అనే ఆరో తరగతి చిన్నారి డెంగ్యూతో నిన్న రాత్రి చనిపోయాడు. అసలే కన్నబిడ్డను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓనర్ ఇంట్లోకి తీసుకురావొద్దంటూ అడ్డుకున్నాడు. దీంతో చేసేది లేక వర్షంలోనే బిడ్డ శవంతో గడిపారు కుటుంబ సభ్యులు. ఇంటి ముందు ఉన్న అరుగుపైనే చిన్నారిని ఉంచి.. తడవకుండా ఉండేందుకు ఈ కుటుంబ సభ్యులే దుప్పట్లతో అడ్డం ఉన్నారు. ఓ వైపు భారీ వర్షం – చనిపోయిన ఇంటి కుటుంబ సభ్యులను ఓనర్ తోపాటు.. చుట్టుపక్కల ఎవరూ కూడా ఆదుకోవటానికి ముందుకు రాకపోవటంతో రాత్రంతా నిస్సాహాయ స్థితిలో ఉన్నది ఆ కుటుంబం. ఉదయం విషయం తెలుసుకున్న కాలనీ వాసులు.. అప్పటికప్పుడు బాక్స్ తీసుకొచ్చి చిన్నారి మృతదేహాన్ని అందులో ఉంచారు. కాలనీవాసులు కొందరు ఆర్థికసాయం చేశారు. అంత్యక్రియలకు సహకారం అందించారు. ఇంటి ఓనర్ తీరుపై మండిపడుతున్నారు స్థానికలు.
హిందూ సంప్రదాయాల్లో తులసి మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అదే విధంగా తులసి మాలతో సంబంధించిన ఆచారాలు కూడా భక్తుల్లో…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ…
ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా వెదజల్లుతూ.. కీర్తికి,…
ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం భక్తి ఉత్సాహం నడుమ నిర్వహించే సత్యదేవుని దివ్య కల్యాణ మహోత్సవం…
వేసవి కాలం ప్రారంభమైతే శరీరంలో వేడి పెరగడం సహజం. అయితే అదే సమయంలో చాలా మందిని వేధించే సమస్యలు ఏంటంటే—ఆసిడిటీ,…
ఇంటి నిర్మాణంలో ప్రతి అంశానికి ప్రాధాన్యం ఉన్నట్లే, పూజా గది స్థానం కూడా చాలా ముఖ్యమని నమ్మకం. హిందూ సంప్రదాయంలో…