Actress Gayathri Guptha : బిగ్ బాస్ మీద కేసు వేసినందుకు నన్ను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయి… అందరి కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయ్…: నటి గాయత్రీ గుప్తా

Actress Gayatri Guptha : ఐస్ క్రీం 2, ఫిదా, బంధుక్ వంటి సినిమాలలో నటించి తాజాగా దయ వెబ్ సిరీస్ లో స్వేచ్చ అనే పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్న గాయత్రి గుప్తా అంతకు ముందు బిగ్ బాస్ తెలుగు మీద కేసులు వేసి ఫేమస్ అయింది. ఒపన్ గా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే గాయత్రి తెలంగాణ సంగారెడ్డి జిల్లా, జోగిపేట్ లో జన్మించింది. ఇంట్లో నుండి బయటికి వచ్చి మొదట సాక్షి న్యూస్ ఛానెల్ లో పనిచేసిన గాయత్రీ ఆపైన సినిమాల్లో నటించింది. అయితే సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లిన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి ఒపనే గా చెప్పి సెన్సేషన్ అయింది.

నాకు బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయి…

బిగ్ బాస్ సమయంలో జరిగింది నేను పోరాడింది వెరైతే మీడియాలో నేను క్యాస్టింగ్ కౌచ్ కోసం పోరాడినట్లు మార్చేశారు. నిజానికి నేను వర్క్ ఎత్తిక్స్ కోసం పోరాడను. వాళ్ళు బిగ్ బాస్ కి వచ్చే ముందు కొన్ని రోజులు ఎవరికీ చెప్పకూడదు. ఎక్కడ కనిపించకూడదు ప్రాజెక్ట్స్ చేయకూడదు అని చెప్పినపుడు దానికి వాళ్ళ నుండి డబ్బు రావాలి అని డిమాండ్ చేసాను. వాళ్ళు చెప్పారని అన్ని రోజులు ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఉంటే చివరి నిమిషంలో బిగ్ బాస్ లో మీరు లేరని చెప్పారు. అలాంటప్పుడు ఆ పదిహేను రోజులకు డబ్బు ఇవ్వాలి అదే నేను ప్రశ్నించాను.

అలాగే నాతో సంతకం చేయించుకున్న బాండ్ పేపర్ ఒక కాపీ అడిగితే ఇవ్వలేదు ఇక ఈ ఇష్యూ మీద కోర్ట్ కి వెళ్ళాను. నా వెనుక ఉంటామని సపోర్ట్ చేస్తాని చెప్పినవాళ్లు మధ్యలోనే పారిపోయారు. ఇక ఆపైన ఆ కేసు డైల్యూట్ అయిపోయింది. ఇక నా హెల్త్ బాగోలేక నేను పట్టించుకోలేదు అంటూ గాయత్రి తెలిపారు. బిగ్ బాస్ లో అందరూ పెద్దవాళ్లు ఉండటం వల్ల బెదిరింపు కాల్స్ చాలా వచ్చేవి. చంపేస్తామని రేప్ చేయిస్తామని మీడియా ముందుకు వెళ్లి సారీ చెప్పాలంటూ బాగా బెదిరించారు అవన్నీటికి సంబంధించిన రికార్డింగ్స్ ఇప్ప్పటికి నా దగ్గర ఉన్నాయ్ అంటూ గాయత్రీ తెలిపారు.