Actress Jyothi : పెళ్లి చేసుకుని తప్పు చేశా… రెండేళ్ల బాబుతో నడిరోడ్డుపైన కూర్చొని ఏడ్చా…: నటి జ్యోతి

Jyothi : ‘ఓ మై లవ్’ సినిమాతో 18 ఏళ్లకే ఇండస్ట్రీకి పరిచయమైన జ్యోతి ఎమ్ఎస్ రెడ్డి గారి సినిమాతో ఇండస్ట్రీకి వచ్చింది. ఇక ‘హంగామా’ సినిమాతో హీరోయిన్ గా ఆలీ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత హీరోయిన్ గా కొనసాగలేకపోయినా వాంప్ పాత్రలను ఎక్కువగా సినిమాల్లో చేసింది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్ లో జ్యోతి పాల్గొని ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే తన వ్యక్తిగత జీవితంలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్న జ్యోతి కామెడీ సినిమాలు ఎక్కువగా చేసినా ప్రస్తుతం తక్కువగా సినిమాల్లో కనిపిస్తోంది.

నడిరోడ్డు మీద చంటి బిడ్డతో…

సినిమాల్లో కెరీర్ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకపోయినా వ్యక్తిగతంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు జ్యోతి చెప్పింది. పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఎప్పుడూ అనుకునేదాన్ని, కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలో నా కంటే వయసులో కొంత చిన్నవాడినే పెళ్లి చెసుకున్నాను అంటూ జ్యోతి తెలిపారు. సరైన గైడన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తొందరపడి పెళ్లి చేసుకున్నాను అంటూ తెలిపారు. పెళ్లయ్యాక దుబాయ్ వెళ్లి స్థిరపడగా భర్త వేధింపులు భరించలేక మళ్ళీ ఇండియా తిరిగి వచ్చేసానని ఇక ఒంటరిగా తన బాబుతో తాను బ్రతుకుతున్న సమయంలో జరిగిన సంఘటనల వల్ల నన్ను ఉన్న పలంగా మా ఓనర్ ఇల్లు ఖాళీ చేయించారు. తప్పు చేయకపోయినా దోషగా నిలబడాల్సి వచ్చింది. ఇక ఇలాంటి ఇష్యూ లో ఆడవాళ్ళను లాగుతారు కానీ మగవాళ్ళను సేవ్ చేస్తారు.

ఇక్కడ కూడా నేనే బలి అయ్యాను అంటూ జ్యోతి చెప్పారు. ఇక రెండేళ్ల బాబుతో ఇంటి కోసం వెతికితే ఎవరూ నాకు ఇల్లు అద్దెకు ఇవ్వలేదు, నడిరోడ్డు మీద పడ్డాను. కానీ నేను ధైర్యంగా నా బిడ్డ కోసం బ్రతికాను. అప్పుడు జరిగిన సంఘటనలు నన్ను చాలా దృఢం చేసాయి. ఇపుడు ఇలాంటివి నేను పట్టించుకోవడం మానేసాను నా బాబు నేను అన్నట్లుగా మా ప్రపంచం అంతే, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు స్నేహితులుగా ఉంటారు, అలాంటి స్నేహితులు నాకు ఉన్నారు, ఇక నా బాబు అంతే నాకు ప్రపంచం అంటూ చెప్పారు.