సమంత చైతన్య విడాకులపై స్పందించిన సీనియర్ నటి.. ఆ గొడవ వారికే తెలుసంటూ ట్వీట్..!

సమంత నాగ చైతన్యల విడాకుల విషయం కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాకుండా సౌత్ ఇండస్ట్రీని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట ఒక్కసారిగా విడిపోతున్నాం అని చెప్పడంతో ఎంతోమంది అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.అయితే సమంత చైతన్య విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటని అభిమానులు ఆరా తీస్తున్నారు.

సమంత చైతన్య విడిపోవడానికి ఆమె సినిమాలలో బోల్డ్ పాత్రలో నటించడమే కారణమని కొందరు భావించగా మరికొందరు సమంత స్టైలిష్ ప్రీతమ్ ప్రధాన కారణం అని మరి కొందరు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా సమంత విడాకుల విషయం విన్న పలువురు సెలబ్రిటీలు వీరి విడాకులపై స్పందిస్తూ తమదైన శైలిలో ట్వీట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే సీనియర్ నటి ఖుష్బూ సమంత చైతన్యల విడాకుల విషయం పై స్పందించారు. భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు వాళ్లకు మాత్రమే తెలుస్తాయని వారి గురించి అనవసరమైన తప్పుడు ప్రచారాలు చేసి వారి ప్రతిష్ఠకు భంగం కలిగించవద్దని ఈ సందర్భంగా ఆమె కోరారు.

ఈ క్రమంలోనే ఖుష్బు తన ట్విట్ లో భాగంగా.. భార్య భర్తల మధ్య ఏం గొడవ జరిగిందనే విషయం వారికి మాత్రమే తెలుసు. వారిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. అయితే వారి ప్రైవసీని ప్రతి ఒక్కరూ గౌరవించాలి వారు ఈ ఘటన నుంచి కోలుకోవడానికి కొంత సమయం ఇవ్వండి అంటూ ఖుష్బూ ఈ సందర్భంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక వీరి విడాకుల విషయం గురించి వర్మ, కంగనా రనౌత్, ప్రకాష్ రాజ్, నటి సురేఖ వాణి వంటి వారు స్పందిస్తూ తమ దైన శైలిలో కామెంట్లు చేశారు.