Actress Sheela Kaur: అల్లు అర్జున్ పరుగు పెట్టించిన నటి షీలా కౌర్ ప్రస్తుతం ఎలా ఉంది ఏం చేస్తుందో తెలుసా?

Actress Sheela Kaur: అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పరుగు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు నటి షీలా కౌర్. లంగా వోణీలో రెండు జడలు వేసుకుని అమాయకపు చూపులతో ఎంతోమందిని ఆకట్టుకున్న ఈమె ఎంతోమంది అబ్బాయిల కలల రాకుమారిగా మారిపోయారు.

ఈ సినిమా తర్వాత ఈమె నటించిన మస్కా, అదుర్స్ సినిమాలను చూసి అసలు పరుగు సినిమాలో నటించిన హీరోయిన్ షీలానేనా ఇక్కడ అంటూ ఆశ్చర్యపోయారు.
ఇలా ఈమె తెలుగు తమిళ భాషలలో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఇలా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె క్యాన్సర్ బారిన పడ్డారని,చాలా దీన పరిస్థితిలో ఉన్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఇలా ఈమె క్యాన్సర్ బారిన పడ్డారంటూ వచ్చిన వార్తలన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది.
ఈమె కేరళకు చెందిన సంతోష్ రెడ్డి అనే వ్యక్తినీ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఈయన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇక ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉన్నారు. ఇలా పెళ్లయిన తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.

Actress Sheela Kaur: వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న షీలా కౌర్…

ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి షీలా ప్రస్తుతం తన భర్తతో కలిసి ఒక సూపర్ మార్కెట్ రన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విధంగా షీలా కౌర్ పెద్ద ఫోటోలను చూసినటువంటి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభిస్తే బాగుంటుందని మరికొందరు తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు.