Actress Shresta : మంచు మనోజ్ తో పెళ్లి… అ ఆమాట అనగానే… మోహన్ బాబు గారు బాగా తిట్టారు…: నటి శ్రేష్ఠ

Actress Shresta : రౌడీ అల్లుడు, మేజర్ చంద్రకాంత్, సమరసింహా రెడ్డి, హిట్లర్, ముగ్గురు మొనగాళ్లు వంటి సినిమాల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేష్ఠ గుర్తుందా.. ముఖ్యంగా సమరసింహా రెడ్డి సినిమాలో బాలయ్య ముగ్గురు చెల్లెల్లో చిన్న చెల్లి సరస్వతిగా నటించిన అమ్మాయి శ్రేష్ఠ. ఆ సినిమాలో బాలయ్య చెల్లిగా కాళ్ల్లు చచ్చుబడిన అమ్మాయి పాత్రలో నటించిన శ్రేష్ఠ ముఖ్యంగా రైల్వే ట్రాక్ సీన్ లో బాగా నటించింది. అందులో ఫ్యాక్షన్ ఎంత ఆకట్టుకుందో అంతే ఎఫెక్ట్ ఇలాంటి సెటిమెంట్ సీన్స్ కూడా అలరించాయి. అయితే ఆ సినిమాలో నటించిన శ్రేష్ఠ ఆ సినిమా తరువాత మళ్ళీ సినిమాల్లో నటించలేదు. మళ్ళీ చాలా కాలానికి యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూలో మెరిసిన ఈ అమ్మాయి తన గురించి వివరించింది.

మనోజ్ తో పెళ్లి… మోహన్ బాబు గారు తిట్టారు…

తెలుగమ్మాయి శ్రేష్ఠ అప్పటి తరం నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరితోనూ బాలనటిగా నటించింది. ఇక చిరంజీవి, బాలకృష్ణ వంటి తరువాత తరం హీరోలతోనూ నటించిన శ్రేష్ఠ తాజాగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను తెలిపారు. మేజర్ చంద్రకాంత్ సినిమా సమయంలో మనోజ్ తో తెగ అల్లరి చేసేదాన్ని అంటూ చెప్పిన శ్రేష్ఠ తాను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పింది.

ఇక ఆ సినిమా సమయంలో పరీక్షలు ఉండటం వల్ల సినిమా షూటింగ్ కి లేట్ గా వస్తానని ముందే కో డైరెక్టర్స్ తో చెప్పినా కమ్యూనికేషన్ సరిగా లేక మోహన్ బాబు గారికి విషయం తెలియక షూటింగ్ వెళ్ళాక నన్ను అమ్మను అందరి ముందు అరిచేసారు. కానీ విషయం తెలిసాక మా తప్పేమి లేదని వచ్చి సారీ చెప్పారు. కానీ అందరి ముందు తిట్టి పక్కన సారీ చెప్పారనే ఫీలింగ్ వచ్చింది నాకు అంటూ శ్రేష్ఠ తన అనుభవాలను పంచుకున్నారు. ఇక శ్రేష్ఠ చదువుయ్యాక మోహన్ బాబు గారు మనోజ్ తో తనకు పెళ్లి చేయాలనే ప్రపోజల్ ను శ్రేష్ఠ పేరెంట్స్ వద్ద పెట్టారట, అయితే నో చెప్పారట శ్రేష్ఠ పేరెంట్స్, ఇక ఇంటర్వ్యూలో కారణాలను చెప్పడానికి శ్రేష్ఠ ఇష్టపడలేదు.