Actress Taapsee: ప్రశ్నలు అడిగే ముందు కొంచెం తెలుసుకుని రండి.. మరోసారి మీడియా పై చిందులు వేసిన తాప్సీ!

Actress Taapsee: ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి తాప్సీ.ఇలా తెలుగులో పలు సినిమాలలో నటించిన ఈమె పూర్తిగా తెలుగు తెరకు దూరమై బాలీవుడ్ ఇండస్ట్రీలో పాగా వేశారు.ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.

తాజాగా తాప్సి నటించిన దొబెరా సినిమా డిజాస్టర్ కావడంతో ఈమె అప్సెట్ అయినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె మీడియాపై సీరియస్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఒక అవార్డు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తాప్సీ మరోసారి మీడియాపై మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరి ఈమెను ప్రశ్నిస్తూ..దొబారా’ చిత్రం విడుదలకు ముందు జ‌రిగిన ‘నెగెటివ్ క్యాంపెయిన్‌ గురించి ప్రశ్నించగా ఈమె ఒక్కసారిగా మండిపడింది. ఈ సినిమా కంటే ముందుగా ఏ సినిమాకు నెగిటివ్ క్యాంపెయిన్‌ జరగలేదు చెప్పండి అంటూ ఎదురు ప్రశ్న వేశారు. ఇలా మీరు నా ప్రశ్నకు సమాధానం చెబితేనే నేను కూడా మీ ప్రశ్నకు సమాధానం చెబుతా అంటూ ఎదురు ప్రశ్న వేశారు.

Taapsee: ప్రియుడితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటి తాప్సీ… పెళ్లి డేట్ ఫిక్స్?

Actress Taapsee: ప్రశ్నించే ముందు తెలుసుకొని మాట్లాడండి..

ఈ క్రమంలోనే రిపోర్టర్ దొబారా చిత్రంతోనే నెగెటివ్ క్యాంపెయిన్ ప్రారంభ అంటూ రిపోర్టర్ సమాధానం చెప్పగా ఈ మాటకు తాప్సీ మాట్లాడుతూ ఏ విషయం గురించైనా ప్రశ్నించే ముందు కొంచెం తెలుసుకొని మాట్లాడండి అంటూ మరోసారి మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తాప్సీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.