Actress Trisha: ఘనంగా సీరియల్ నటి త్రిష ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు?

Actress Trisha: బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష అనంతరం పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగులో పలు సీరియల్స్ లో సందడి చేసిన ఈమె రీసెంట్గా మనసిచ్చి చూడు సీరియల్ లో కూడా రేణు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఈ విధంగా మనసిచ్చి చూడు సీరియల్ లో నటి కీర్తి భట్ కి చెల్లెలి పాత్రలో నటించిన త్రిష ఈ సీరియల్ తర్వాత ఇతర సీరియల్స్ లో కనిపించలేదు.ఈ క్రమంలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుండడంతో ఏ సీరియల్స్ లోను కనిపించలేదంటూ వార్తలు వచ్చినప్పటికీ ఈ విషయంపై ఈమె స్పందించలేదు అయితే తాజాగా నిశ్చితార్థం చేసుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Actress Trisha: చూడముచ్చటగా ఉన్న త్రిష విశాల్ దంపతులు..

ఇలా నటి త్రిష విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటి త్రిష నిశ్చితార్థానికి మనసిచ్చి చూడు సీరియల్ టీం మొత్తం హాజరైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం విశాల్ త్రిష నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ఎంతో మంది అభిమానులు కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.