ఆడిషన్స్ కు ఆ నటి రూ.80 చీర కట్టుకొని వెళ్లిందట.. కారణం ఏంటంటే..

అక్కినేని నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘లవ్ స్టోరీ’. ఈ సినిమా ఈ నెల 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై హీరో, హీరోయిన్లే కాకుండా సిని పరిశ్రమలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే.. ఈ సినిమా విడుదలైన తర్వాత మంచి వసూళ్లను సాధిస్తే.. మిగతా సినిమాలను కూడా విడుదల చేసేందుకు క్యూ కడతాయి.

అందుకే ప్రతీ ఒక్కరూ ఈ సినిమా విడుదలపై తర్వాత అది సాధించే కలెక్షన్లపై నమ్మకం పెట్టుకున్నారు. ప్రతీ ఒక్కరు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడానికి కారణం కూడా అదే. అయితే శేఖర్ కమ్ముల దీనికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అతడి దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా ప్రేక్షకుల ఒక విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది.

దీనిలో కూడా ఏదో అద్భుతం చేసే ఉంటాడని ప్రతీ ఒక్కరు ఆశలు పెట్టుకున్నారు. సాయి పల్లవి ఫిదా సినిమాలో అతడి డైరెక్షన్లో చేసిన విషయం తెలిసిందే. అందులో తెలంగాణ యాస సాయి పల్లవి దించేసింది. దీనిలో కూడా తెలంగాణ పరిసరాల నేపథ్యంలో సినిమా ఉండనుందని సినీ వర్గాల టాక్. ఇదిలా ఉండగా.. ఇందులో నాగచైతన్య తల్లిగా సీనియర్ నటి ఈశ్వరీ రావు నటించారు. ఇందులో పేద మహిళగా ఆ క్యారెక్టర్ ఉంటుంది.

అయితే ఆడిషన్స్ కు ఆమెనకు ఫోన్ చేసి రమ్మన్నడప్పుడు ఆమె రూ.80 చీర కట్టుకొని వచ్చిందని.. ఆమెను చూసి తాను ఆశ్చర్యపోయానని శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇలాంటి నటిని తాను ఎన్నడూ చూడలేదని.. ప్రశంసలు కురిపించాడు. ఇదిలా ఉండగా.. ఆమె అరవింద సమేత, అల వైకుంఠపురం, కాలా సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.