అతడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. అకస్మాత్తుగా అతడు ఇటీవల చనిపోయాడు. అయితే అతడి చావుకు కారణం భూవివాదాలే కారణం అంటూ పోలీసులు కూడా అనుకున్నారు. విచారణ చేపట్టిన తర్వాత కూడా వాళ్లు అదే అనుకున్నారు. అయితే దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అతడిని చంపిన వ్యక్తిని పట్టుకున్నాడు. అతడు కూడా ఆ వ్యాపారి చావుకు భూ వివాదాలే కారణం అని చెప్పాడు.
అయితే పోలీసులకు నమ్మశక్యం కాలేదు. దీంతో లోతుగా విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగ్పూర్కు చెందిన ప్రదీప్ బగ్డే అనే వ్యక్తి కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
అయితే అతడు కొన్ని రోజుల క్రితం కన్నుమూశాడు. పోలీసులు అతడి మరణానికి కారణం భూ వివాదాలే అని అనుకున్నారు. కానీ పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. అతడి భార్యనే ఈ హత్యకు ప్లాన్ వేసిందని పోలీసలు గుర్తించారు. ఆమెను విచారించగా.. విషయాలు బయటకు వచ్చాయి. ప్రదీప్ బగ్డే ఇంట్లో హత్య కేసు నిందితుడు పవన్ చౌదరి అద్దెకు ఉంటున్నాడు.
అతడే ఈ హత్య చేసినట్టు విచారణలో అంగీకరించాడు. ఇలా అతడిని చంపమని అతడి భార్యే డబ్బులు ఇచ్చినట్లు చెప్పాడు. అతడు తన స్నేహతుడితో కలిసి హత్య చేసినట్లు చెప్పాడు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య హత్య చేయించడానికి గల కారణం ఏంటి..? ఇంట్లో అద్దెకు ఉంటున్న అతడితో ఈమెకు వివాహేతర సంబంధం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. హత్యలో మరో నిందితుడు పవన్ చౌదరి స్నేహితుడిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…