Adi Pinishetty : హీరో ఆది పినిశెట్టి పెళ్లి కట్నం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Adi Pinishetty : తెలుగులో ఎన్నోహిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన రవి రాజా పినిశెట్టి వారసుడిగా తెలుగు తమిళ్ సినిమాలలో రానిస్తున్నాడు ఆది పినిశెట్టి. తమిళ్ లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది తెలుగులో కూడా గుండెల్లో గోదారి, ఒక విచిత్రం, మలుపు, సరైనోడు, రంగస్థలం, నిన్నుకోరి వంటి సినిమాలలో నటించి అభిమానులను సొంతం చేసుకున్నాడు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ కి విలన్ గా నటించి మెప్పించాడు. ఇక తాజాగా ఇప్పుడు పోతినేని రామ్ హీరోగా వస్తున్న వారియర్ సినిమాలో కూడా విలన్ గా నటించబోతున్నాడు.

ఆది పినిశెట్టి గత నెల మే 18 న ఒక ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. ఆది, హీరోయిన్ నిక్కి గల్రానీ ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ ఇద్దరు 2015లో వచ్చిన యాగవరైనమ్‌ నా కక్కా అనే సినిమాలో మొదటిసారి జంటగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో స్నేహితులుగా మారిన ఈ ఇద్దరు తరువాత వచ్చిన మరగధ నాణ్యం చిత్రంతో ప్రేమికులయ్యారు. ఇక ఇపుడు పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం తరువాత రెండురోజుల క్రితమే తిరుమల దర్శనం కూడా చేసుకున్నారు ఈ కొత్త జంట. అయితే వీరిది ప్రేమ వివాహం అయినప్పటికీ ఎక్కడ చూసినా కట్నం గురించే చర్చలు నడుస్తున్నాయి.

ఆది తీసుకున్న కట్నం ఎంతో తెలుసా…..

ఇక ఇపుడు సోషల్‌ మీడియాలో ఆది పెళ్లి కట్నం గురించే చర్చ జరుగుతోంది. ఎంత ప్రేమ వివాహం అయితే మాత్రం కట్నం తీసుకోకుండా ఎందుకు వుంటాడు? భారీగానే కట్నం తీసుకొని ఉంటాడని కొందరు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ కామెంట్లను ఆయన దగ్గరి సన్నిహితులు మాత్రం తోసిపుచ్చినట్లు సమాచారం. ఆది అసలు కట్నకానులకు పూర్తి వ్యతిరేకం అని, పెళ్లికి అతను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. అమ్మాయి వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా ఆది వారిని సున్నితంగా వద్దు అని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం ఆది నిర్ణయానికి ఫిదా అవుతున్నారు.