Anasuya Bharadwaj : తెలుగు బుల్లి తెర పై జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన యాంకర్ అనసూయ. కెరీర్ పీక్స్ కి వెళ్ళాక పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. కానీ అనసూయ మాత్రం ఇద్దరు పిల్లల తల్లిగా కెరీర్ స్టార్ట్ చేసింది. అయినా జబర్దస్త్ తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తరువాత సినిమా అవకాశాలను కూడా అందుకుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా అలరించింది.
భర్తతో సముద్ర తీరాన…..
అనసూయ ప్రొఫెషనల్ జీవితంలో ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబంతో కూడా గడపడానికి అంతే ప్రాముఖ్యతను ఇస్తుంది. అనసూయ తన భర్త భరద్వాజది ప్రేమ వివాహం. వీరికి ఇద్దరు మగపిల్లలు. కెరీర్ పరంగా బాగా బిజీగా ఉండే అనసూయ తీరిక దొరికినపుడు తన కుటుంబంతో సేదతీరుతుంటుంది. తాజాగా తన 12 ఏళ్ల వైవాహిక జీవితాన్ని అనసూయ తన భర్త భరద్వాజతో తన ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక సముద్ర తీరాన చేతిలో చేయి వేసుకుని నడుస్తూ చాలా అందంగా వారి బంధాన్ని వర్ణిస్తూ నెటిజన్స్ తో తన అభిమానులతో పంచుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో అందరిని ఆకర్షిస్తున్నాయి.
ప్రేమతో మొదలైన వీరి ప్రయాణం పెళ్లితో బలపడి తమ జీవితాన్ని ప్రేమానుబంధంతో ఎంతలా ఆస్వాదిస్తున్నారో ఫోటోల ద్వారా మనకు అర్థమవుతుంది. సినిమా పరిశ్రమలో ఉండేవారిపై ఎన్నో గాసిప్స్ వస్తుంటాయి. అయితే వీటివల్ల ఎన్నో జీవితాలు నాశనం కూడా అవుతుంటాయి. అలాంటి ఫీల్డ్ లో ఉండి కూడా అనసూయ తన కెరీర్ ను ఇటు వ్యక్తిగత జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తోంది. ఇక ఈ జంట ఇపుడు సోషల్ మీడియాలో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక మహిళలు ఉంటుందంటారు, కానీ ఒక మహిళల కెరీర్ విజయం వెనుక కూడా అర్థం చేసుకునే జీవిత భాగస్వామి ఉండాలనేది అనసూయ, శశాంక్ భరద్వాజ్లను చూస్తే తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…