సునీల్‌తో కలిసి చేసిన సీన్లన్నీ తీసేశారు: ఆర్టిస్ట్ జయవాణి

రెండు, మూడు రోజులు షూటింగ్ చేశాక, ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ, డబ్బింగ్‌కి కూడా తనని పిలవలేదని ప్రముఖ నటి జయవాణి తెలిపారు. అది అందరివాడు సినిమా అన్న ఆమె, ఒకవేళ ఆ సీన్ ఆ సినిమాలో అన్‌వాంటెడ్‌ అని తీసేసి ఉంటారేమో అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ సినిమాలో చేసినందుకు గానూ కనీసం డబ్బులు కూడా రాలేదని ఆమె అన్నారు.

ఇలా సినిమాలో యాక్ట్‌ చేసి, తర్వాత కొన్నింటికి డబ్బులు కూడా రావని, దానికి చాలా కారణాలుంటాయని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదా ? లేదంటే మేనేజర్స్ ఇవ్వలేదా ? లేదా ఇంకేదైనా కారణమై ఉండొచ్చని జయవాణి తెలిపారు. ఇంకా అదీ కాదంటే ప్రొడక్షన్‌ వాళ్లకే ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు అని ఆమె అన్నారు. కొందరైతే తనకు ఫోన్ చేసి ఈ సీన్‌కి మీకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాము అంటే, ఓకే సర్ అని డబ్బింగ్ కూడా చెప్పి వస్తూండేదాన్ని అని ఆమె స్పష్టం చేశారు.

తనకు అలా డబ్బు ఇవ్వమని చెప్పిన సినిమాలు తనకు చాలా మిస్సయ్యాయని ఆమె వివరించారు. కానీ దాని గురించి తనకు అంత ఇబ్బందేం అనిపించేది కాదని ఆమె చెప్పారు. తానెప్పుడూ డబ్బుల గురించి గానీ, ఇంకే విషయానికి గానీ తాను ఎవ్వరితోనూ గొడవ పడడం అలాంటివేం చేయలేదని ఆమె స్పష్టం చేశారు.

ఇలా తానే అర్థం చేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయేదాన్ని ఆమె చెప్పారు. వీలైతే తరువాతి సినిమాలో మీ బ్యానర్‌లో ఏమైనా సినిమా తీస్తే మాత్రం తనకు అవకాశం ఇవ్వండని మాత్రం చెప్పేదాన్నంటూ ఆమె అన్నారు. అలాగే ఆంధ్రుడు సినిమాలో కూడా నేను సునీల్‌తో చేసిన సీన్లు అన్నీ తీసేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.