తెలుగు సినీ ప్రేక్షకులకు కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటారు. కొన్ని వందల సినిమాల్లో కమెడియన్ గా నటించి తెలుగు సినీ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఒకప్పుడు తెలుగు సినిమాలలో కమెడియన్ బ్రహ్మానందం లేని సినిమా లేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అయితే రాను రాను బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించేశారు. అయితే ఆయన ఎందుకు సినిమాలు తగ్గించారు? ఆయనే సినిమాలు తగ్గించారా? లేక ఆయనకు అవకాశాలు రాక ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారా?అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయాలపై స్పందించారు బ్రహ్మానందం. తాను యాక్టింగ్ కి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పుకొచ్చారు.
దాదాపుగా నేను గత 35 ఏళ్ల నుంచి 3,4 షిఫ్ట్ లు పని చేస్తూ వచ్చాను. ఈ క్రమంలోనే సరైన తిండి తినక, నిద్ర లేక, తిన్నది అరగక వాంతులు చేసుకుంటూ ఇలా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అయితే ప్రస్తుతం నా శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి అనుకుంటున్నాను. విశ్రాంతి తీసుకోవడానికి కొంత డబ్బును పోగొట్టుకున్న నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ అసలు నిజాన్ని బయట పెట్టేసాడు బ్రహ్మానందం.
అదేవిధంగా తనపై వస్తున్న మీన్స్ పై స్పందిస్తూ.. నాపై మీన్స్ చేసే వాళ్లకు థాంక్స్ చెబుతున్నాను. ఎందుకంటే నేను సినిమాల్లో నటించకపోయినా ఇప్పటికీ నన్ను జనాలు మర్చిపోకుండా గుర్తు చేసేలా చేస్తున్నా మీన్స్ క్రియేటర్స్ ని, వాళ్ళ ప్రయత్నాన్ని సైతం మెచ్చుకోవాల్సిందే అని చెప్పుకొచ్చారు. అలాగే ప్రస్తుతం సినిమాల కోసం కాకుండా తన కోసం తానే బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…
ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…
ఉదయం నిద్రలేవగానే బెడ్ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…
2026 ఏప్రిల్ 17న రానున్న వైశాఖ అమావాస్యకు జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. ఈసారి…
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…