General News

నేటి నుంచి ఈ నిబంధనలు మారనున్నాయి.. అగ్గిపెట్టె ధరలతో సహా మరికొన్ని..

నేటి నుంచి ఆర్థిక, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన నిబంధనలు మారే అవకాశం ఉంది. అవేంటంటే.. పదవీ విరమణ పొందిన వారు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ కేంద్రాలలో సమర్పించాలి. ఈ సమర్పణకు చివరి తేదీ నవంబర్ 30, 2021. ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలి. లేదంటే.. మీ పెన్షన్ రద్దు చేయబడుతుంది.

ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతా ఉన్నవాళ్లకు వడ్డీ రేటును తగ్గించింది. ఖాతాలో రూ.10 లక్షల కంటే తక్కువ డిపాజిట్ ఉన్నవాళ్లకు 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది. రూ.10 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్లకు 5 బేసిస్ పాయింట్లకు తగ్గించింది.

ఈ నిబంధన నేటి నుంచి అమలులోకి వచ్చాయి. ఇక ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్లకు షాకింగ్ అనే చెప్పాలి. నేటి నుంచి మొదలయ్యే ఈఎంఐ లావాదేవీలపై ప్రెసెసింగ్ ఫీజులను వసూలు చేయనుంది. SBI క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లు పన్నుతో పాటు రూ.99 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1, 2021లోపు ఏదైన ప్రొడక్ట్ పై ఈఎంఐ ఉంటే.. దానికి ఇది వర్తించదు.

ఇక అగ్గి పెట్టెల ధరలు ఈ రోజు నుంచి పెరగనున్నాయి. దాదాపు 14 సంవత్సరాల తర్వాత అగ్గిపెట్టె ధరలు పెరగనున్నాయి. దీనిని రూ.1 నుంచి రూ.2 వరకు పెంచారు. అగ్గిపెట్టె ధరలు చివరిసారిగా 2007లో బాక్స్‌కు 50 పైసల నుండి రూ.1కి పెంచారు. ఇక ప్రతీ నెల ఒకటో తేదీన గ్యాస్ ధరల్లో మార్పులు వచ్చేవి. కానీ గత కొన్ని నెలల నుంచి మాత్రం 1 నుంచి 15 తేదీ మధ్యలో సవరిస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి ఎల్పీజీ నిబంధనల్లో మార్పులు వస్తాయని తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago