మనకు లభిస్తున్న పండ్లల్లో చాలా వరకు సీజన్ వారీగా అందుబాటులో ఉంటాయి. కానీ బొప్పాయి మాత్రం ఏడాది అంతటా అందుబాటులో ఉంటుంది. దీని వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంది ఈ పండును ఇష్టపడతారు కూడా. కొంతమంది ఈ బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడానికి ఇష్టపడతారు.
ఇంకా కొందరు సలాడ్ లేదా స్నాక్ సమయాల్లో తింటారు. బొప్పాయి ఆకుల రసం అయితే.. ప్లేట్ లెట్స్ పడిపోయిన వారికి ఎంతో ఉపయోకరంగా పనిచేస్తుంది. దీనిని సైంటిఫిక్ గా కూడా రుజువు చేశారు. ప్లేట్ లెట్స్ పడిపోయిన వారికి.. ఈ రసంలో కొంచెం తేనెను కలుపుకొని తాగితే అద్బుతంగా పనిచేస్తుందని రుజువు చేశారు. ఒక్క రోజులోనే లక్ష నుంచి 1.5 లక్షల వరకు కౌంట్ పెరిగినట్లు నిర్ధారించారు.
బొప్పాయి ఆకుల రసాన్ని దోమల వల్ల వచ్చే డెంగ్యూ జ్వరాన్ని ఎదుర్కోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న బొప్పాయిని ఎక్కువగా తింటే.. అన్నవాహిక దెబ్బతినే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భంతో ఉన్న వాళ్లు దీనిని తనకూడదు.
ఎందుకంటే.. ఇది గర్భాశయ సంకోచానికి దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయి అనేది సమతుల్యంగా ఉండాలి. దీనిని తినడం వల్ల అకస్మాత్తుగా తగ్గుతుంది.
అందుకే ఎక్కువగా తినకపోవడం మంచిది. దీనిలో పెన్సిల్ ఐసోథియోసైనేట్ అనే పదార్థం ఉంటుంది. ఇదే విషానికి కారణం అవుతుంది. అందుకే దీనిని మితంగా తినాలని అంటుంటారు. బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి విటమిన్ ఏ, సి అవసరం. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. బొప్పాయిలో కూడా విటమిన్ సీ ఉంటుంది. అందుకే ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…