Pushpa: మూడు భాగాలుగా రాబోతున్న పుష్ప.. సాధ్యమయ్యే పనేనా అంటూ కామెంట్స్?

Pushpa: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఇప్పటికే షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న తరుణంలో సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది. ఈ సినిమాకు మూడో భాగం కూడా రాబోతుంది అంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో పలువురు ఈ వార్తలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.

పుష్ప సినిమా రెండు భాగాలుగా రాబోతుంది అనడం సరైన విషయం అయినప్పటికీ మూడు భాగాలుగా రాబోతుంది అనడం పెద్దగా ప్రేక్షకులు స్వీకరించలేకపోతున్నారు. ఇలా ఈ సినిమా మూడు భాగాలుగా విడుదలయితే మొదటికే మోసం వస్తుందని పలువురు భావిస్తున్నారు. మూడో భాగం చిత్రీకరణ కోసం రెండో భాగంలో కథను పెద్దగా చూపించారని దీంతో ఈ సినిమాకు మైనస్ అవుతుందని పలువురు భావిస్తున్నారు.

జనాలు ఇష్టపడరు..

ఇక అల్లు అర్జున్ కు పుష్ప సినిమా మాత్రమే కాకుండా ఇతర డైరెక్టర్లతో కూడా కమిట్మెంట్స్ ఉన్నాయి. ఇక సుకుమార్ కూడా అల్లు అర్జున్ తోనే కాకుండా ఇతర హీరోలతో సినిమా చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు అంతేకాకుండా సినిమా చేయడానికి మహేష్ బాబు రామ్ చరణ్ వంటి హీరోలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఒక సినిమా నచ్చింది కదా అని వరుస పెట్టి ఆ సినిమాలను చేసుకుంటా పోతే జనాలు కూడా ఆ సినిమాలను పెద్దగా చూడరు అంటూ పలువురు ఈ విషయంపై కామెంట్లు చేస్తున్నారు.