Sneha Reddy:  మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన స్నేహ రెడ్డి… హీరోయిన్ గా ఏమాత్రం తీసిపోదుగా?

Sneha Reddy:  నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. హీరోగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా ఈయన భార్య స్నేహారెడ్డి ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకపోయినా హీరోయిన్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఈమెకు సొంతం అని చెప్పాలి.

ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి స్నేహ రెడ్డి ఇండస్ట్రీలోకి కనుక వస్తే స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ భావిస్తుంటారు. ఎప్పటికప్పుడు ట్రెండీ వేర్ దరిస్తూ భారీ స్థాయిలో ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా తన పిల్లలకు సంబంధించిన విషయాలు అలాగే తన భర్తకు సంబంధించిన విషయాలను షేర్ చేయడంతో ఈమె సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య పెరిగిపోయింది.

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమెకు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నారు. అయితే ఈ విషయాన్ని క్యాష్ చేసుకున్నటువంటి కొన్ని కంపెనీలు ఈమె చేత తమ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు. అయితే మొదటిసారి ఈమె ఒక యాడ్ షూట్ లో చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కిండర్ బ్రాండ్ …

కిండర్ బ్రాండ్ కు సంబంధించిన కిండర్‌ ఎస్ చోకో బోన్ క్రిస్పీ ప్రాడక్ట్ ను ప్రమోట్ చేస్తూ యాడ్ షూట్ చేశారు. ఇందులో చాలా నేచురల్ గా కనిపించారు. ఇలా మొదటిసారి ఈమె కెమెరా ముందుకు వచ్చి ఈ యాడ్ చేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ యాడ్ లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు ఆ అబ్బాయి స్థానంలో ఆయాన్ కనుక ఉండి ఉంటే ఈ బ్రాండ్ వ్యాల్యూ మరింత పెరిగిపోయేది అంటూ అభిమానులు భావిస్తున్నారు.