Tejaswini: ఇప్పటికైనా మనుషులు ఎలాంటివారో అర్థం చేసుకో… ప్రియాంక పై ఫైర్ అయిన అమర్ భార్య తేజు?

Tejaswini: బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ దీప్ భార్య తేజస్విని ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరగగా అందులో అమర్ చాలా వరకు పోరాడారు. అయితే ఈయనకు కొందరు పాయింట్స్ ఇవ్వటం వల్ల చివరి వరకు కొనసాగారు అనే సంగతి మనకు తెలిసిందే అయితే అర్జున్ మొదటి ఫైనల్ లిస్ట్ గా అడుగుపెట్టారు.

ఈ టాస్కులలో భాగంగా అమర్ ప్రియాంక పట్ల కాస్త వైల్డ్ గా వ్యవహరించారు ఆమెపై ఫిజికల్ అటాక్ చేసారు. దీంతో ఆమె అమర్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన పాయింట్స్ ఇవ్వకుండా గౌతమ్ కి ఇచ్చేశారు. దీంతో అమర్ కూడా కాస్త అప్ సెట్ అయ్యారు. ఇలా మొదటిసారి గౌతమ్ కి తన పాయింట్స్ ఇచ్చినటువంటి ఈమె రెండోసారి కూడా అమర్ కి ఇవ్వాలని అనుకోలేదు.

ఇక వీరిద్దరూ కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలుసు. ఇలా తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయకపోవడంతో అమర్ ఫాన్స్ కూడా ఈ విషయంలో కాస్త ఫీలయ్యారు. ఈ క్రమంలోనే అమర్ భార్య తేజు కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె తన భర్తకు ధైర్యం చెబుతూ బలంగా నిలబడు ఇప్పటికైనా మనుషులు ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకో అంటూ పోస్ట్ చేశారు.

బలంగా నిలబడు…

ఈ విధంగా తేజు ఇలాంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా ఈమె ప్రియాంకను ఉద్దేశించే చేశారని తెలుస్తుంది. ఈమె ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రియాంకతో అసలు మాట్లాడలేదు కనీసం తన వైపు కూడా చూడలేదు ఇప్పుడు కూడా తన గురించే ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఇక ప్రియాంక బయటకు వచ్చినా కూడా తేజు మాట్లాడే అవకాశం లేదు అని పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.