Babu Mohan : ‘ఆహుతి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు బాబు మోహన్. ఆ తరువాత వచ్చిన ‘మామగారు’ సినిమాతో కమెడియన్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక అనేక సినిమాల్లో కోటా శ్రీనివాస్ రావు గారి పెయిర్ గా కామెడీ పండించిన బాబు మోహన్ మరి కొన్ని సినిమాల్లో బ్రహ్మానందం జోడిగా కూడా మంచి కామెడీ అందించారు. టీడీపీ తరపున ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రచారం చేసిన బాబు మోహన్ ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక టీడీపీ హయాంలోనే రెండోసారి గెలిచి మినిస్టర్ అయ్యారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక తెరాసలో చేరిన బాబు మోహన్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు.
విషం పెట్టి చంపాలనుకున్నారు…
ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో బాబు మోహన్ తనకు విషం పెట్టి చంపాలనుకున్న విషయాన్ని తెలిపి షాక్ కి గురిచేసారు. ‘వన్స్ మోర్’ అనే షూటింగ్ కోసం ఢిల్లీ వెళ్ళినపుడు అక్కడ భరణి పాన్ కొంచం ఇచ్చి అలవాటు చేశాడు. వాడొక గాడిద చదువురాని వాడు అంటుంటాం, కానీ వాడు పండితుడు. భరణి నే కొంచం తిను ఏమీ కాదు అని అలవాటు చేయడంతో పాన్ బీడా తినడం అలవాటైంది. రోజుకి 30 దాకా పాన్లు తినే వాడిని అంతలా పాన్ కి బానిసయ్యను. ఇక హైదరాబాద్ రావాలంటే మెదక్ నుండి సంగారెడ్డి మీదుగా వచ్చేవాడిని ఆ సమయంలో ఒక పాన్ షాప్ దగ్గర పాన్ కట్టించుకుని వెళ్తుండడం అలవాటు. అలా ఒక రోజు కట్టించుకుని కొంత దూరం వెళ్ళాక తినాలనిపించి పాన్ డబ్బా తెరిచేలోగా పాన్ షాప్ అతను ఫోన్ చేసి తినొద్దని, అందులో విషం ఉందని చెప్పి పెట్టేసాడు.
ఇక మళ్ళీ అతని భార్య ఫోన్ చేసి బాగా ఒత్తిడి చేసి ఇలా చేయమన్నారు అంటూ ఏడ్చి చెప్పింది. ఆరోజున అర్థమైంది రాజకీయాలు ఇంతలా ఉంటాయా అని అంటూ బాబు మోహన్ వివరించారు. ఇక పాన్ ను ఎలా మానేసారో కూడా చెప్పారు. సెంట్రల్ మినిస్టర్ తో మీటింగులో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నపుడు వచ్చిన కేంద్ర మంత్రి బీడా తింటున్నారు. ఇక నేను ఊరికే ఉంటే చంద్రబాబు నాయుడు గారు నన్ను తిను పర్వాలేదు అన్నట్లుగా సైగ చేసారు కానీ నాకు ఆయన ముందు అలా తినాలని అనిపించలేదు. ఇక ఆతరువాత మెల్లగా ఆ అలవాటును మానేసాను అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…