Tejaswini: బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ దీప్ భార్య తేజస్విని ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరగగా అందులో అమర్ చాలా వరకు పోరాడారు. అయితే ఈయనకు కొందరు పాయింట్స్ ఇవ్వటం వల్ల చివరి వరకు కొనసాగారు అనే సంగతి మనకు తెలిసిందే అయితే అర్జున్ మొదటి ఫైనల్ లిస్ట్ గా అడుగుపెట్టారు.
ఈ టాస్కులలో భాగంగా అమర్ ప్రియాంక పట్ల కాస్త వైల్డ్ గా వ్యవహరించారు ఆమెపై ఫిజికల్ అటాక్ చేసారు. దీంతో ఆమె అమర్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన పాయింట్స్ ఇవ్వకుండా గౌతమ్ కి ఇచ్చేశారు. దీంతో అమర్ కూడా కాస్త అప్ సెట్ అయ్యారు. ఇలా మొదటిసారి గౌతమ్ కి తన పాయింట్స్ ఇచ్చినటువంటి ఈమె రెండోసారి కూడా అమర్ కి ఇవ్వాలని అనుకోలేదు.
ఇక వీరిద్దరూ కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలుసు. ఇలా తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయకపోవడంతో అమర్ ఫాన్స్ కూడా ఈ విషయంలో కాస్త ఫీలయ్యారు. ఈ క్రమంలోనే అమర్ భార్య తేజు కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె తన భర్తకు ధైర్యం చెబుతూ బలంగా నిలబడు ఇప్పటికైనా మనుషులు ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకో అంటూ పోస్ట్ చేశారు.
బలంగా నిలబడు…
ఈ విధంగా తేజు ఇలాంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా ఈమె ప్రియాంకను ఉద్దేశించే చేశారని తెలుస్తుంది. ఈమె ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రియాంకతో అసలు మాట్లాడలేదు కనీసం తన వైపు కూడా చూడలేదు ఇప్పుడు కూడా తన గురించే ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఇక ప్రియాంక బయటకు వచ్చినా కూడా తేజు మాట్లాడే అవకాశం లేదు అని పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…