Movie News

Tejaswini: ఇప్పటికైనా మనుషులు ఎలాంటివారో అర్థం చేసుకో… ప్రియాంక పై ఫైర్ అయిన అమర్ భార్య తేజు?

Tejaswini: బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్ గా పాల్గొన్నటువంటి అమర్ దీప్ భార్య తేజస్విని ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యారు. ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరగగా అందులో అమర్ చాలా వరకు పోరాడారు. అయితే ఈయనకు కొందరు పాయింట్స్ ఇవ్వటం వల్ల చివరి వరకు కొనసాగారు అనే సంగతి మనకు తెలిసిందే అయితే అర్జున్ మొదటి ఫైనల్ లిస్ట్ గా అడుగుపెట్టారు.

ఈ టాస్కులలో భాగంగా అమర్ ప్రియాంక పట్ల కాస్త వైల్డ్ గా వ్యవహరించారు ఆమెపై ఫిజికల్ అటాక్ చేసారు. దీంతో ఆమె అమర్ పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన పాయింట్స్ ఇవ్వకుండా గౌతమ్ కి ఇచ్చేశారు. దీంతో అమర్ కూడా కాస్త అప్ సెట్ అయ్యారు. ఇలా మొదటిసారి గౌతమ్ కి తన పాయింట్స్ ఇచ్చినటువంటి ఈమె రెండోసారి కూడా అమర్ కి ఇవ్వాలని అనుకోలేదు.

ఇక వీరిద్దరూ కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలుసు. ఇలా తన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయకపోవడంతో అమర్ ఫాన్స్ కూడా ఈ విషయంలో కాస్త ఫీలయ్యారు. ఈ క్రమంలోనే అమర్ భార్య తేజు కూడా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈమె తన భర్తకు ధైర్యం చెబుతూ బలంగా నిలబడు ఇప్పటికైనా మనుషులు ఎవరు ఎలాంటి వారో అర్థం చేసుకో అంటూ పోస్ట్ చేశారు.

బలంగా నిలబడు…

ఈ విధంగా తేజు ఇలాంటి పోస్ట్ చేయడంతో కచ్చితంగా ఈమె ప్రియాంకను ఉద్దేశించే చేశారని తెలుస్తుంది. ఈమె ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి వెళ్ళినప్పుడు ప్రియాంకతో అసలు మాట్లాడలేదు కనీసం తన వైపు కూడా చూడలేదు ఇప్పుడు కూడా తన గురించే ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. ఇక ప్రియాంక బయటకు వచ్చినా కూడా తేజు మాట్లాడే అవకాశం లేదు అని పలువురు ఈ పోస్ట్ పై కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

9 minutes ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

28 minutes ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

17 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

18 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

19 hours ago

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…

19 hours ago