ఎప్పుడు గొడవలే అంటూ సంసారం గుట్టు విప్పిన అనసూయ?

బుల్లితెర అందాల యాంకర్ గా, వెండితెర అద్భుతమైన నటిగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న అనసూయ తన వ్యక్తిగత జీవితం గురించి అనేక సందర్భాలలో అభిమానులతో ముచ్చటించారు. తన జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయని,తన ప్రేమ పెళ్లి గురించి సినిమా తీయొచ్చని తెలిపిన సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే అనసూయ తన భర్త సుశాంక్ భరద్వాజ్ గురించి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు.ఎన్‌సీసీ క్యాంప్‌లోతన ప్రేమ మొదలైందని ముందుగా తన ప్రేమ గురించి కాకుండా పెళ్లి చేసుకుందాం అనే ప్రపోజల్ తనకు ఎంతగానో నచ్చిందని తెలిపారు. తొమ్మిది సంవత్సరాల ప్రేమ తరువాత పెద్దలను ఒప్పించి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యామని ఈ యాంకరమ్మ ఎన్నో సందర్భాలలో తెలిపారు.

ఈ క్రమంలోనే నేడు వాళ్ళ 11 వ వివాహ దినోత్సవం సందర్భంగా తన సంసారం గుట్టును విప్పారు.తన భర్త ఇంట్లో ఎలా ఉంటారు.. ఏంటి.. అనే విషయాలను అభిమానులతో పంచుకున్నారు.ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇంట్లో తరచూ గొడవలు పడుతున్నాము. మా మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతుంటాయి. గొడవలు జరిగిన సమయంలో ఏవేవో పిచ్చి పనులు చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాలలో మా మధ్య ఎన్నో భేదాభిప్రాయాలు మనస్పర్థలు కూడా తలెత్తుతుంటాయని తెలిపారు.

ఈ విధంగా మా ఇద్దరి మధ్య గొడవ జరిగిన వెంటనే ఒకరి చేతిని ఒకరు పట్టుకుని మా మధ్య జరిగిన గొడవలు అన్నింటిని మర్చిపోతాము. అందువల్లే మా ప్రయాణాన్ని ఇన్నిరోజులు కొనసాగించామని నేడు వివాహ దినోత్సవం అయినప్పటికీ ఈ రోజు కూడా పోట్లాడుకున్నామని అందుకే ఎలాంటి కొత్త ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేయలేదని ఈ సందర్భంగా అనసూయ తెలియజేశారు.