Anchor Pradeep : మల్లేమాలకి మరో షాక్.. గుడ్ బై చెప్పనున్న యాంకర్ ప్రదీప్..!?

Anchor Pradeep : మల్లెమాల… ఒక అద్భుతమైన నిర్మాణ సంస్థ. ఒకప్పుడు మంచి సినిమాలు నిర్మించిన ఈ నిర్మాణ సంస్థ ప్రస్తుతం బుల్లితెరమీద అభిమానులను ఆకట్టుకొనే ప్రోగ్రాములు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ టీవీ లో జబర్దస్త్, క్యాష్, ఢీ, వంటి షో లతో సంచలనాలు సృష్టిస్తోంది. బుల్లితెర మీద టాప్ రేటెడ్ ప్రోగ్రాములుగా సాగుతున్నాయి. అంతేకాదు తక్కువ బడ్జెట్ తో సీరియల్స్, రియాలిటీ షోలు చేయడం వీరి ప్రత్యేకత. అయితే ఈమధ్య ఈ నిర్మాణం సంస్థ నుండి కొంత మంది యాంకర్ లు వరుసగా దూరం అవుతున్నారు.

గుడ్ బై చెప్పనున్న యాంకర్ ప్రదీప్…

ఈ మధ్య మల్లెమాల ప్రోగ్రాములు కాస్త కళ తప్పినట్టు కనిపిస్తున్నాయి. టాప్ ఆర్టిస్టులు, యాంకర్లు షోల నుండి వెళ్లిపోవడమే దీనికి కారణం. అందులోను ముఖ్యంగా ఢీ, జబర్దస్థ్ షోలు రేటింగ్లు కూడా తగ్గుతున్నాయి. దీనికి కారణం జబర్దస్త్ నుండి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను వెళ్లిపోవడం. అలాగే ఢీ షో నుంచి యాంకర్ రష్మీ, సుధీర్, దీపికా పిల్లి వెళ్లిపోవడం. సుధీర్ సినిమాల కారణంగా మల్లెమాలను వీడినట్లు సమాచారం. మరి మిగిలిన వారు ఎందుకు వెళ్లిపోయారో తెలియని పరిస్థితి. అయితే గతం లో నాగబాబు ఈటీవీని వీడే సమయంలో కొన్ని ఆరోపణలు చేశారు. మల్లెమాల వాళ్లు రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఇస్తారు అని అంతే కాకుండా భోజనం సదుపాయాలు సరిగా కల్పించరని తీవ్రస్థాయిలో ఆరోపించారు.

అయితే తాజాగా యాంకర్ ప్రదీప్ మల్లెమాలను వీడనున్నట్లు సమాచారం. ఢీ 14తో ప్రదీప్ అగ్రిమెంట్ ముగియనుందట… ఢీ 15లో ఇంక అతడు కొనసాగడు అని వార్తలు వస్తున్నాయి. ఢీ షోకి సుధీర్, హైపర్ ఆది రాక ముందు నుండి ప్రదీప్ సక్సెస్ ఫుల్ గా షోని నిర్వహిస్తున్నాడు. అపుడే సుధీర్ ఢీ షో నుంచి వెళ్లిపోయారు. ఇక ప్రదీప్ కూడా దూరమైతే ఆషో రేటింగ్ మరింత దిగజారడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు.