Anupama Parameswaran: కార్తికేయ 2 సినిమా విషయంలో బాధగా ఉందన్న అనుపమ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి హీరోయిన్. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇలా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబడుతుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం లాభాలను అందుకుంటుంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ దిల్ రాజు వంటి నిర్మాతలు హాజరై చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఈ సినిమా విజయం సాధించినందుకు అందరూ సంతోషంగా ఉండగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాత్రం అనుపమ తనకు చాలా బాధగా ఉందంటూ బాంబు పేల్చారు.

Anupama Parameswaran: ఈ సినిమాతో రుణం తీరిపోయిందా…

ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విషయంలో తనకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగిపోవడంతో ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనలో ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు.ఇలా ఈమె ఈ సినిమా విషయంలో బాధగా ఉందని చెప్పడంతో యధావిధిగా నేటిజన్ లు తనపై భారీగా ట్రోల్ చేస్తున్నారు.