Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేనటువంటి హీరోయిన్. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే అనుపమ పరమేశ్వరన్ తాజాగా నిఖిల్ సరసన నటించిన కార్తికేయ 2 సినిమాలో నటించిన విషయం మనకు తెలిసింది. ఈ సినిమా ఆగస్టు 13వ తేదీ విడుదల అయ్యి కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.
ఇలా ఈ సినిమా మంచి హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లను రాబడుతుంది.ఇకపోతే ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించి ప్రస్తుతం లాభాలను అందుకుంటుంది. ఇక ఈ సినిమా విజయవంతం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.ఈ క్రమంలోనే అల్లు అరవింద్ దిల్ రాజు వంటి నిర్మాతలు హాజరై చిత్ర బృందం పై ప్రశంసలు కురిపించారు.ఇలా ఈ సినిమా విజయం సాధించినందుకు అందరూ సంతోషంగా ఉండగా ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాత్రం అనుపమ తనకు చాలా బాధగా ఉందంటూ బాంబు పేల్చారు.
ఈ సక్సెస్ మీట్ కార్యక్రమంలో అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ కార్తికేయ 2 సినిమా విషయంలో తనకు చాలా బాధగా ఉందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంతో అద్భుతమైన ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా జరిగిపోవడంతో ఈ సినిమాతో నాకు రుణం తీరిపోయిందా అనే బాధ తనలో ఎక్కువగా ఉందంటూ చెప్పుకొచ్చారు.ఇలా ఈమె ఈ సినిమా విషయంలో బాధగా ఉందని చెప్పడంతో యధావిధిగా నేటిజన్ లు తనపై భారీగా ట్రోల్ చేస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…