పవన్ అభిమానులకు బ్యాడ్ న్యూస్.. భీమ్లా నాయక్ విడుదల తేదీ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రిమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతోంది. ప్రుథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ పోటా పోటీగా నటించిన మళయాళం సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్లను సాధించింది.

దీంతో తెలుగులో కూడా విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. రానాకు జోడీగా మళయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తోంది. అయితే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా.. జనవరి 12 న విడుదల చేయాలని మొదటగా చిత్ర యూనిట్ భావించింది.

అయితే తాజాగా పవన్ అభిమానుకు షాక్ ఇచ్చే వార్తను వెల్లడించింది భీమ్లా నాయక్ టీం. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీని శివరాత్రి బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది.  సంక్రాంతి బరిలో రాధేశ్యాం, ట్రిపుల్ ఆర్ లాంటి బడా సినిమాలు ఉండటంతో పాటు భీమ్లానాయక్ వస్తే థియేటర్ల సమస్య వస్తుందని దిల్ రాజు భీమ్లా నాయక్ మూవీ టింను కన్విన్స్ చేశాడు. అయితే పవర్ స్టార్ సినిమా కోసం ఆత్రుతగా వేచిచూస్తున్న అభిమానులకు మాత్రం ఈ విషయం మింగుడుపడటం లేదు.

ఈసినిమాలో  రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నారు. మరోవైపు థమన్ మ్యూజిక్ ఆల్ రెడీ హిట్ అయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.