నందమూరి నట సింహం బాలకృష్ణ అఖండ సినిమాలో భారీ హిట్ కొట్టాడు. బాక్సాఫీస్ వద్ద అఖండ సినిమా వసూళ్ల కిక్ ఇచ్చింది. ఇటు సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటిన బాలయ్య బాబు.. ఓటీటీలో కూడా దుమ్ము రేపుతున్నాడు. ఇటీవల ఆహా ఓటీటీలో మొదలైన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో సక్సెస్ అయింది. తొలి షోలోనే కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో చేసిన టాక్ షో జనాలను విపరీతంగా ఆకట్టుకుంది.
షోలో బాలకృష్ణ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటున్నాయి. గెస్ట్ లుగా వచ్చినవారు బాలయ్య బాబు సందడి చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ షో ద్వారా ఇప్పటికే మెహన్ బాబు, నాని, బోయపాటి శ్రీను, బ్రహ్మానందం, ఎంఎం కీరవాణి, రాజమౌళి, అనిల్ రావిపూడి వంటి వారితో సరదాగా ముచ్చటించారు బాలకృష్ణ.
అఖండ టీం టాక్ షోలో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ తో స్టెప్పులు కూడా వేసి అందరిని మెప్పించారు. ఇక ఇటీవలే ఈషోలో మాస్ మాహారాజా రవితేజ.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని సైతం సందడి చేశారు. ఈ షో డిసెంబర్24న ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే అన్ స్టాపబుల్ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈషోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రాబోతున్నారు.
దీనికి సంబంధించిన షోను క్రిస్మస్ కానుగా ఆహాలో స్ట్రీమింగ్ చేయనున్నారు. బన్నీతో పాటు పుష్ప టీం కూడా సందడి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పుష్ప సినిమా హిట్ తో బన్నీ తన సత్తాను చాటాడు. దేశవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుని, భారీ వసూళ్లను రాబడుతోంది. ఓ వైపు అఖండ… మరో వైపు పుష్ప ఇలా ఇద్దరి మధ్యలో టాక్ షో ఏవిధంగా ఉండబోతోందో అని అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…