పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భీమ్లానాయక్. ఈ చిత్రం కోసం అభిమానుల ఎదురుచూస్తున్నారు. మళయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం సినిమాకు రిమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కుతోంది. ప్రుథ్వీరాజ్ సుకుమారన్, బిజూ మీనన్ పోటా పోటీగా నటించిన మళయాళం సినిమా అక్కడ రికార్డ్ కలెక్షన్లను సాధించింది.
దీంతో తెలుగులో కూడా విపరీతంగా హైప్ క్రియేట్ అయ్యింది. రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నాడు. పవన్ సరసన నిత్యామీనన్ నటిస్తోంది. రానాకు జోడీగా మళయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ నటిస్తోంది. అయితే ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా.. జనవరి 12 న విడుదల చేయాలని మొదటగా చిత్ర యూనిట్ భావించింది.
అయితే తాజాగా పవన్ అభిమానుకు షాక్ ఇచ్చే వార్తను వెల్లడించింది భీమ్లా నాయక్ టీం. జనవరి 12న విడుదల కావాల్సిన ఈ మూవీని శివరాత్రి బరిలో నిలువనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో రాధేశ్యాం, ట్రిపుల్ ఆర్ లాంటి బడా సినిమాలు ఉండటంతో పాటు భీమ్లానాయక్ వస్తే థియేటర్ల సమస్య వస్తుందని దిల్ రాజు భీమ్లా నాయక్ మూవీ టింను కన్విన్స్ చేశాడు. అయితే పవర్ స్టార్ సినిమా కోసం ఆత్రుతగా వేచిచూస్తున్న అభిమానులకు మాత్రం ఈ విషయం మింగుడుపడటం లేదు.
ఈసినిమాలో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలను అందిస్తున్నారు. మరోవైపు థమన్ మ్యూజిక్ ఆల్ రెడీ హిట్ అయింది. సితార ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…