Balakrishna: తారకరత్న కోసం మరోసారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బాలయ్య!

Balakrishna: నందమూరి తారకరత్న నారా లోకేష్ యువగలం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు మద్దతు తెలుపుతూ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ పాదయాత్ర ప్రారంభమైన కొంత సమయానికి తారకరత్న స్పృహ తప్పి పడిపోవడంతో వెంటనే తనని సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆయనకు గుండెపోటు రావడంతో వెంటనే బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు.

తారకరత్నకు పల్స్ రేట్ పూర్తిగా పడిపోవడంతో వైద్యులు దాదాపు 45 నిమిషాల పాటు శ్రమించి సిపిఆర్ చేసిన అనంతరం పల్స్ రేట్ మొదలైందని అయితే ఆయన ఇంకా స్పృహలోకి రాలేదని తెలుస్తుంది.ఇకపోతే ఈయన స్పృహ తప్పి పడిపోయిన సమయంలో ఆయన మెదడుకు ఆక్సిజన్ అందక మెదుడు పనితీరు కూడా పనిచేయలేదని దీంతో ప్రత్యేక వైద్య బృందం సమక్షంలో ఈయనకు చికిత్స జరుగుతోందని తెలుస్తోంది.

తారకరత్న ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిందని వార్తలు రావడంతో బాలయ్య బెంగళూరులోనే ఉంటూ తారకరత్న చెవిలో మృత్యుంజయ మంత్రాన్ని చదివిన విషయం మనకు తెలిసిందే. ఇలా మృత్యుంజయ మంత్రం చదివిన తర్వాత తారకరత్న శరీరం వైద్యానికి సహకరించిందని తెలిపారు. ఇక ఈయన కోలుకోవాలని చిత్తూరులోని మృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేశారు.

Balakrishna: తారకరత్న కోసం పూజలు నిర్వహిస్తున్న బాలయ్య…

తారకరత్న మెదడుపై పూర్తిగా ప్రభావం చూపిందని తెలియడంతో విదేశీ నిపుణుల సమక్షంలో ఈయనకు చికిత్స జరగనున్న నేపథ్యంలో మరోసారి బాలయ్య తారకరత్న కోసం మృత్యుంజయ మంత్రాన్ని జపించడమే కాకుండా ప్రత్యేక పూజలు కూడా చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా తారకరత్న ఆరోగ్యం కోసం బాలయ్య ఎంతో శ్రమిస్తున్నారని ఆయన క్షేమంగా తిరిగి బయటకు రావాలని అభిమానులు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.