“ఎలాగో ప్లాపయ్యే సినిమాకు ఇంకో టెక్ అవసరమా..” బాలయ్య షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అయితే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ మొట్టమొదటిసారిగా “అనసూయమ్మ గారి అల్లుడు” చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో “తిరగబడ్డ తెలుగు బిడ్డ” అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణకు ఈ సినిమాలో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ సినిమా కథ వినగానే ఈ సినిమా పక్క ఫ్లాప్ అవుతుందని బాలయ్య అంచనా వేశాడు. అందుకోసమే ఈ సినిమాలో నటించడం కోసం బాలకృష్ణ ఇష్టపడలేదు.

పరుచూరి బ్రదర్స్ తిరగబడ్డ తెలుగు బిడ్డ కథను దర్శకుడు కోదండరామిరెడ్డికి వివరించగా కథ నచ్చకపోవడంతో ఈ సినిమా చేయడానికి కోదండ రామిరెడ్డి ఒప్పుకోలేదు. ఇదే విషయమై సీనియర్ ఎన్టీఆర్ దగ్గర కోదండరామి రెడ్డి చెప్పారు. కోదండరామిరెడ్డి ఇలా చెప్పగానే పరుచూరి బ్రదర్స్ అదేంటి అన్న గారితో అలా చెప్పారు అని అడగగా.. నాకు నచ్చలేదు కాబట్టి అలా చెప్పానని కోదండ రామిరెడ్డి చెప్పుకొచ్చారు.

నచ్చకపోతే వదిలేయండి అని అప్పుడు రామారావు చెప్పినప్పటికీ ఆ తర్వాత కోదండరామి రెడ్డికి ఫోన్ చేసి నాకు సినిమాకథ బాగా నచ్చింది బాలకృష్ణతో ఈ సినిమా చేద్దామని చెప్పారు. ఈ సినిమాలో నటించడం బాలకృష్ణకు కూడా ఇష్టం లేకపోయినప్పటికీ తన తండ్రికి నచ్చడంతో తన తండ్రి కోసం ఈ సినిమాలో నటించారు.

ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ తెరకెక్కిస్తుండగా కోదండరామిరెడ్డి బాలకృష్ణతో మరొక టేక్ చేద్దామని చెప్పగా.. ప్లాపయ్యే సినిమాకు మరొక టేక్ ఎందుకని బాలకృష్ణ కామెంట్ చేసినట్లు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముందుగా బాలకృష్ణ అనుకున్నట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.