టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎంతో మంది దర్శకులతో పని చేశారు. అయితే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ మొట్టమొదటిసారిగా “అనసూయమ్మ గారి అల్లుడు” చిత్రంలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబినేషన్లో “తిరగబడ్డ తెలుగు బిడ్డ” అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విషయానికి వస్తే బాలకృష్ణకు ఈ సినిమాలో నటించడం ఏ మాత్రం ఇష్టం లేదు. ఈ సినిమా కథ వినగానే ఈ సినిమా పక్క ఫ్లాప్ అవుతుందని బాలయ్య అంచనా వేశాడు. అందుకోసమే ఈ సినిమాలో నటించడం కోసం బాలకృష్ణ ఇష్టపడలేదు.
పరుచూరి బ్రదర్స్ తిరగబడ్డ తెలుగు బిడ్డ కథను దర్శకుడు కోదండరామిరెడ్డికి వివరించగా కథ నచ్చకపోవడంతో ఈ సినిమా చేయడానికి కోదండ రామిరెడ్డి ఒప్పుకోలేదు. ఇదే విషయమై సీనియర్ ఎన్టీఆర్ దగ్గర కోదండరామి రెడ్డి చెప్పారు. కోదండరామిరెడ్డి ఇలా చెప్పగానే పరుచూరి బ్రదర్స్ అదేంటి అన్న గారితో అలా చెప్పారు అని అడగగా.. నాకు నచ్చలేదు కాబట్టి అలా చెప్పానని కోదండ రామిరెడ్డి చెప్పుకొచ్చారు.
నచ్చకపోతే వదిలేయండి అని అప్పుడు రామారావు చెప్పినప్పటికీ ఆ తర్వాత కోదండరామి రెడ్డికి ఫోన్ చేసి నాకు సినిమాకథ బాగా నచ్చింది బాలకృష్ణతో ఈ సినిమా చేద్దామని చెప్పారు. ఈ సినిమాలో నటించడం బాలకృష్ణకు కూడా ఇష్టం లేకపోయినప్పటికీ తన తండ్రికి నచ్చడంతో తన తండ్రి కోసం ఈ సినిమాలో నటించారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక సీన్ తెరకెక్కిస్తుండగా కోదండరామిరెడ్డి బాలకృష్ణతో మరొక టేక్ చేద్దామని చెప్పగా.. ప్లాపయ్యే సినిమాకు మరొక టేక్ ఎందుకని బాలకృష్ణ కామెంట్ చేసినట్లు కోదండరామిరెడ్డి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ముందుగా బాలకృష్ణ అనుకున్నట్టే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో “అఖండ” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…