Bellamkonda Ganesh : మా నాన్నకి బాలకృష్ణ కి మధ్య వివాదానికి కారణం… మా అన్నయ్య బాలీవుడ్ సినిమా చేయడానికి కారణం…: బెల్లంకొండ గణేష్

Bellamkonda Ganesh : సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ ‘గంగ’ సినిమా తరువాత సినిమాలను నిర్మించలేదు. కేవలం కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్ధ కొడుకు సాయి శ్రీనివాస్ తో కలిసి అల్లుడు శీను సినిమాను నిర్మించారు. ఇక ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ కొడుకులు సాయి శ్రీనివాస్, గణేష్ ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయమయ్యారు. శీను తాజాగా బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ సినిమాలో నటించగా తమ్ముడు గణేష్ స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. తాజాగా మరో సినిమా ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాతో అలరించునున్న గణేష్ ఇటీవల ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గురించి మాట్లాడారు.

బాలకృష్ణతో వివాదం… అన్న బాలీవుడ్ ఎంట్రీ…

బెల్లంకొండ సురేష్ గారు బాలకృష్ణ గారి మధ్య 2004 లో జరిగిన కాల్పుల వివాదం అప్పట్లో హాట్ టాపిక్. బెల్లంకొండ సురేష్ అలాగే మరోవ్యక్తి సత్యనారాయణ చౌదరి మీద బాలకృష్ణ కాల్పులు జరిపిన సంఘటనలో అప్పట్లో కేసు నడిచింది. ఈ వివాదం తరువాత బెల్లం కొండ సురేష్ గారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా జరిగారు అనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ విషయం గురించి సురేష్ గారి చిన్న కొడుకు గణేష్ మాట్లాడుతూ నా వయసు అపుడు పదేళ్ళు కూడా లేవు అందుకే నాకు ఆ విషయం గురించి పెద్దగా తెలియదు.

ఇక పెద్దయ్యాక మా నాన్నని కుటుంబంలో ఎవరు ఆ విషయం గురించి అడగలేదు. అడగలసిన అవసరం రాలేదు అంటూ చెప్పారు. ఇక తన అన్న తెలుగులో ఫ్లాప్స్ ఎక్కువవడం వల్ల బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడన్న దాంట్లో వాస్తవం లేదని చెప్పారు. తాను త్వరలో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాడు. అక్కడ గంగుబాయ్ కతీయవాడి లాంటి సినిమాలను తీసిన బ్యానర్ నుండి అన్నయ్యకి ఆఫర్ రావడం వల్ల అక్కడ నటించారు అంటూ చెప్పారు గణేష్.