Bellamkonda Ganesh : సూపర్ హిట్ బ్లాక్ బస్టర్స్ ని అందించిన నిర్మాత బెల్లంకొండ సురేష్ ‘గంగ’ సినిమా తరువాత సినిమాలను నిర్మించలేదు. కేవలం కొడుకును సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్ధ కొడుకు సాయి శ్రీనివాస్ తో కలిసి అల్లుడు శీను సినిమాను నిర్మించారు. ఇక ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ కొడుకులు సాయి శ్రీనివాస్, గణేష్ ఇద్దరూ కూడా ఇండస్ట్రీలో హీరోలుగా పరిచయమయ్యారు. శీను తాజాగా బాలీవుడ్ లో ఛత్రపతి రీమేక్ సినిమాలో నటించగా తమ్ముడు గణేష్ స్వాతిముత్యం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. తాజాగా మరో సినిమా ‘నేను స్టూడెంట్ సార్’ అనే సినిమాతో అలరించునున్న గణేష్ ఇటీవల ఇంటర్వ్యూలో తమ ఫ్యామిలీ గురించి మాట్లాడారు.
బాలకృష్ణతో వివాదం… అన్న బాలీవుడ్ ఎంట్రీ…
బెల్లంకొండ సురేష్ గారు బాలకృష్ణ గారి మధ్య 2004 లో జరిగిన కాల్పుల వివాదం అప్పట్లో హాట్ టాపిక్. బెల్లంకొండ సురేష్ అలాగే మరోవ్యక్తి సత్యనారాయణ చౌదరి మీద బాలకృష్ణ కాల్పులు జరిపిన సంఘటనలో అప్పట్లో కేసు నడిచింది. ఈ వివాదం తరువాత బెల్లం కొండ సురేష్ గారు సినిమా ఇండస్ట్రీకి దూరంగా జరిగారు అనే అభిప్రాయాలు వెలువడ్డాయి. ఈ విషయం గురించి సురేష్ గారి చిన్న కొడుకు గణేష్ మాట్లాడుతూ నా వయసు అపుడు పదేళ్ళు కూడా లేవు అందుకే నాకు ఆ విషయం గురించి పెద్దగా తెలియదు.
ఇక పెద్దయ్యాక మా నాన్నని కుటుంబంలో ఎవరు ఆ విషయం గురించి అడగలేదు. అడగలసిన అవసరం రాలేదు అంటూ చెప్పారు. ఇక తన అన్న తెలుగులో ఫ్లాప్స్ ఎక్కువవడం వల్ల బాలీవుడ్ లో సినిమా చేస్తున్నాడన్న దాంట్లో వాస్తవం లేదని చెప్పారు. తాను త్వరలో తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నాడు. అక్కడ గంగుబాయ్ కతీయవాడి లాంటి సినిమాలను తీసిన బ్యానర్ నుండి అన్నయ్యకి ఆఫర్ రావడం వల్ల అక్కడ నటించారు అంటూ చెప్పారు గణేష్.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…