Pallavi prashanth: మొదటిసారి అరెస్టుపై స్పందించిన పల్లవి ప్రశాంత్.. చచ్చిపోవాలనిపించింది అంటూ కామెంట్స్?

Pallavi prashanth: పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ కార్యక్రమంలో అందరికీ పరిచయమయ్యారు. అంతకుముందు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రశాంత్ బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చినటువంటి ఈయన కప్పు గెలుచుకొని సెలబ్రిటీ అయ్యారు.

ఇక హౌస్ లో ఉన్నప్పుడు ఈయనకు అమర్ తో జరిగిన గొడవ కారణంగా గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు అమర్ కారు పై దాడి చేశారు. ఈ దాడిలో భాగంగా పలువురు సెలబ్రిటీల కార్లు ధ్వంసం కావడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వం కావడంతో పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

ఇలా రెండు రోజులపాటు జైలులో ఉన్నటువంటి ప్రశాంత్ అనంతరం బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇలా విడుదలైనటువంటి ఈయన పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బిబి ఉత్సవ్ కార్యక్రమంలో కూడా పల్లవి ప్రశాంత్ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మొదటిసారి తన అరెస్టు గురించి స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు.

నాన్న కళ్ళల్లో ఆనందం చూడాలనుకున్న…

నేను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని ఎలాగైనా కప్పు గెలుచుకుని తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని అనుకున్నాను కానీ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. అయితే నేను జైలులో ఉన్నప్పుడు నాన్న కోర్టు దగ్గర పడుకున్న వీడియోలు చూసి ఆ క్షణం నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానా అనిపించింది అంటూ ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.