ఎన్టీఆర్ షోలో సెలబ్రెటీలు 25 లక్షల కంటే ఎక్కువ గెలవలేరా? అదంతా స్క్రిప్టేనా ?

బుల్లితెరపై ఇప్పటికే ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ షోలు ప్రసారమవుతున్నాయి. అలాంటి వాటిలో ఎవరు మీలో కోటీశ్వరులు షో కూడా ఒకటి. ఈ షోకు ఇప్పటికే నాగార్జున, చిరంజీవి లాంటి అగ్రహీరోలు హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుండగా, ఈ షోలో ఈ సారి కొద్దిగా మార్పులు చేసి దీనిని జెమినీ టీవీ వాళ్లు ప్రసారం చేశారు.బిగ్ బాస్ షో కు హోస్ట్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటివరకు వెండితెరపై తనదైన శైలిలో నటిస్తూ అలరించిన ఎన్టీఆర్, ప్రస్తుతం బుల్లితెరపై హోస్ట్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు.ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో కి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వచ్చి సందడి సందడి చేశారు.ఈ షో మొదటి ఎపిసోడ్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హాజరయ్యారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ అద్భుతంగా ఆడుతూ ఎన్నో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ, ప్రేక్షకులను అలరిస్తూ 25 లక్షలు గెలుచుకున్నారు.

అనంతరం తదుపరి ఎపిసోడ్ కి డైరెక్టర్ కొరటాల శివ, రాజమౌళి ఈ కార్యక్రమానికి వచ్చారు. వీరిద్దరూ కూడా 25 లక్షల రూపాయల గెలుచుకున్నారు. అనంతరం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా కూడా ఈ షో లో కనిపించి సందడి సందడి చేసింది. సమంత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని 25 లక్షల రూపాయలు తీసుకుంది. ఇక చివరి ఎపిసోడ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ షో కి వచ్చారు.ఈ క్రమంలోనే తన సినిమాలకు సంబంధించి, ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

మహేష్ బాబు కూడా 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. ఈ షో కి వచ్చిన ప్రతి ఒక్క సెలబ్రేట్ ఇప్పుడు 25 లక్షలు గెలుచుకోవడం ఏమిటి అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఈ షో కి వచ్చిన ప్రతి సెలబ్రిటీ కేవలం 25 లక్షలు మాత్రమే గెలుచుకోవడంతో ఈ కార్యక్రమం గురించి ముందుగానే తెలియజేశారు అన్నా సందేహాలు తలెత్తుతున్నాయి. సెలబ్రిటీలకు ముందుగా సమాచారం ఇవ్వడంతో 25 లక్షల వరకు మాత్రమే ఈ షోలో గెలుచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పందిస్తున్న నెటిజన్లు సెలబ్రిటీలకు కేవలం 25 లక్షలు గెలుచుకున్న అంత తెలివి మాత్రమే ఉందా అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నార