Category Archives: Featured

Featured posts

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Sai Sreenivas: మంచి మనసు చాటుకున్న బెల్లంకొండ హీరో… గ్రేట్ అంటున్న నేటిజన్స్?

Sai Sreenivas: సినీ ఇండస్ట్రీలో నిర్మాతలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఒకటి. బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన వారసులుగా ఇండస్ట్రీలోకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అడుగుపెట్టిన సంగతి మనకు తెలిసిందే.

అల్లుడు శీను అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. అయితే ఈయన తన మొదటి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా తనని ఇన్ని సంవత్సరాలు పాటు ఆదరించిన అభిమానులకు ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇలా ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా పలు ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేశారు. ఇందులో భాగంగా తన ఇండస్ట్రీ కెరియర్ పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా అందుల పాఠశాలకు వెళ్లివారికి భోజన సదుపాయాన్ని కల్పించడమే కాకుండా వారికి దుస్తులను కూడా పంపిణీ చేశారు.

అంద విద్యార్థులకు అండగా..
ఇలా అంద విద్యార్థుల కోసం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన ఈ మంచి పనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ ఈయన మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలో కొన్ని దశాబ్దాలను పూర్తి చేసుకున్న ఎవరు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు మీరు గ్రేట్ అంటూ కామెంట్లో చేస్తున్నారు.

Bigg Boss: బిగ్ బాస్ ఒక చెత్త షో… నేను వెళ్లడం ఏంటీ…బిగ్ బాస్ షో పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి!

Bigg Boss: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమము ఒకటి. ఈ కార్యక్రమం తెలుగులో ఏడు సీజన్ల పూర్తి అయ్యాయి. త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమం సెప్టెంబర్ మొదటి వారంలో ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగో ప్రోమో కూడా విడుదలైన సంగతి తెలిసిందే.

ఇక ఈ కార్యక్రమానికి ప్రారంభం కాబోతుందని విషయం తెలియడంతో ఎంతో మంది ఈ కార్యక్రమం పై ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ పేర్లలో వేణు స్వామి పేరు కూడా వినపడుతుంది.

ఇలా వేణు స్వామి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఇదే ప్రశ్న ఎదురయింది. బిగ్ బాస్ కార్యక్రమానికి మీరు వెళ్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజమేనా స్వామి అంటూ ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ బిగ్ బాస్ కార్యక్రమానికి రావాలని గత కొన్ని సీజన్లో నుంచి నన్ను పిలుస్తున్నారు కానీ నేను వెళ్లలేదు.

వెళ్తే ఓడిపోతారా..
నాకు బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లడం ఇష్టం ఉండదు అదొక చెత్త షో. ఈ కార్యక్రమంలోకి వెళ్లి విజేతలుగా వచ్చిన వారందరూ రెచ్చిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ కార్యక్రమానికి వెళ్లి ఎంతో మంది జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. అందుకే ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లొద్దని నేను చాలామందికి చెబుతుంటాను అలాంటిది నేనేలా వెళ్తానని తెలిపారు. ఇలా ఈయన వెళ్లలేదని క్లారిటీ ఇచ్చినప్పటికి కొంతమంది మీ జాతకంలో మీరు ఓడిపోతారని ఉందా అందుకే వెళ్లలేదా అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Janasena: జనసేనలోకి వైసీపీ బ్యాచ్ ఎంట్రీకి నాగబాబు గ్రీన్ సిగ్నల్… షరతులు వర్తిస్తాయి?

Janasena: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడు సంచలంగానే ఉంటాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా కూటమి అత్యధిక మెజారిటీ సొంతం చేసుకుని అధికారం చేపట్టిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ కూటమిలో భాగంగా జనసేన పార్టీ కూడా భాగమైన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటూ ఒకప్పుడు ఆయనపై ఉన్న విమర్శలు కూడా వచ్చాయి.

ఇలా పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విమర్శలు వచ్చిన ఆయన వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఈయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించారు. ఇక జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా పలు దిశా నిర్దేశాలు చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో మంచి స్థాయిలో ఉండే దీంతో ఎంతోమంది ఇతర పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కేవలం రాజకీయ నేతలు మాత్రమే కాకుండా కార్యకర్తలు సైతం జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.

కేసులు పెట్టనివారు..
ఇలా జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నిస్తున్న వారికి నాగబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే కొన్ని కండిషన్లను కూడా పెట్టారు. జనసేన పరివారాన్ని ఇబ్బందులకు గురి చేయని.. కేసులు పెట్టని వారికి మాత్రమే జనసేన కండువా కప్పుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారని ఇటీవల నాగబాబు కూడా ఈ విషయంపై మాట్లాడుతూ స్పష్టత ఇచ్చారు.

Araa Mastan: కేకే సర్వే చూసి షాక్ అయ్యాను.. ఆరా మస్తాన్ సంచలన వ్యాఖ్యలు?

Araa Mastan: ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు 50 రోజులవుతున్న ఇప్పటికీ ఎన్నికల ఫలితాల గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇలా గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే మరోవైపు సంక్షేమ ఫలాలను కూడా అందించారు అయితే ఈసారి ఎన్నికలలో తప్పకుండా తిరిగి తామే అధికారంలోకి వస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేసింది.

ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారం నుంచి పంపించాలని కూటమి కంకణం కట్టుకొని పెద్ద ఎత్తున పార్టీ ప్రచార కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ విషయంలో కూటమి సక్సెస్ అయిందని చెప్పాలి. 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.

ఇక ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేవరకు కూడా ప్రతి ఒక్కరూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా అదే విధంగా తెలియజేశాయి కానీ కేకే సర్వే మాత్రం కూటమి ఘనవిజయం సాధిస్తుందని, కూటమి 161 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని వెల్లడించారు.

ఇలా కేకే సర్వే చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు కానీ చివరికి ఆయన చెప్పినదే నిజం కావడంతో ఒక్కసారిగా కేకే సర్వే ఆల్ ఇండియా లెవెల్ లో మారుమోగిపోయింది. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పిన ఆరా మస్తాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన కేకే సర్వే గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
40 నియోజకవర్గాలు..

ఈ సందర్భంగా ఆరా మస్తాన్ మాట్లాడుతూ తాను అన్ని నియోజకవర్గాలలో శాంపిల్స్ తీసుకొని సర్వే చేయలేదని తెలిపారు. కేవలం 40 నియోజకవర్గాలలో మాత్రమే శాంపిల్స్ తీసుకొని అనంతరం ఫీడ్ బ్యాక్ ద్వారా ఫలితాలను తెలిపానని వెల్లడించారు. ఇక కేకే సర్వే గురించి ఈయన మాట్లాడుతూ..కేకే సర్వే చూసి షాక్ అయ్యానని, కచ్చితంగా ప్రిడిక్ట్ చేసిన అతన్ని అభినందించాల్సిందే అని చెప్పుకొచ్చారు. అయితే కేకే సర్వే మెకానిజం, శాంపుల్స్ గురించి అక్కడ ప్రస్తావించలేదని గుర్తు చేశాడు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల పై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan: జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయంలో తరచూ వార్తలలో నిలుస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడంతో పలువురు ఈయన పెళ్లిళ్ల గురించి విమర్శలు చేస్తూ వచ్చారు. ఇక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఎన్నో సందర్భాలలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి బహిరంగ సభలలో కూడా మాట్లాడిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హింసల గురించి పలు విషయాలు వెల్లడించారు 2019 నుంచి 24 వరకు గత ప్రభుత్వం రాష్ట్రంలో హింసలను ప్రోత్సహించింది అని తెలిపారు.

నేను పుట్టినప్పటినుంచి నాపై ఇప్పటివరకు ఒక్క కేసు కూడా లేదు కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏకంగా నాపై 17 కేసులు అలాగే పవన్ కళ్యాణ్ పై ఏడు కేసులు పెట్టారని చంద్రబాబు నాయుడు తెలిపారు. నాపై పెట్టిన కేసులు కారణంగా పవన్ కళ్యాణ్ రోడ్డుపై పడుకుని నిరసన తెలిపే పరిస్థితికి తీసుకువచ్చారని తెలిపారు.

చట్టబద్ధంగా చేశారు..
ఇక అసెంబ్లీ సమావేశాలలో భాగంగా పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది చట్టబద్ధంగానే చేశారు. నువ్వు (జగన్) కూడా తెగ కలవరిస్తున్నావ్ కావాలంటే పోయి కాపురం చెయ్యవయ్యా అన్నా నేను కూడా అని గుర్తు చేశారు చంద్రబాబు. వ్యక్తి గతంగా తీసుకురావద్దని చంద్రబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. ఇలా మహిళలను ఉద్దేశిస్తూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ చంద్రబాబు హెచ్చరించారు.

Bigg Boss 8: బిగ్ బాస్ 8 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Bigg Boss 8: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రసారం కాబోతోంది.

ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ కార్యక్రమం పూర్తి కాగానే బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలను కూడా హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి యధావిధిగా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

తాజాగా బిగ్ బాస్ 8 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. సీజన్ సెవెన్ కోసం నాగార్జున 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.

వారంలో రెండు రోజులు..
ఇకపోతే సీజన్ 8 కోసం ఈయన ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నాగార్జున వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే తెరపై కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

Kumari Aunty: పల్లవి ప్రశాంత్ బాటలో కుమారీ ఆంటీ… కప్ అందుకుంటారా?

Kumari Aunty: కుమారి ఆంటీ పరిచయం అవసరం లేని పేరు ఈమె హైదరాబాద్లో ఒక రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ నిర్వహిస్తూ తన జీవనోపాధిని జరుపుకుంటున్నారు. ఈ విధంగా కుమారి ఆంటీ తక్కువ ధరకే వివిధ రకాల ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకురావడంతో ఒక్కసారిగా ఈమె ఫేమస్ అయ్యారు. ఈమెను ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడంతో కుమారి ఆంటీ సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యారు.

ఇక ఈమె దగ్గర ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చేవారు అంటేనే ఈమె క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది. ఇలా ఈమె ఫుడ్ స్టాల్ వద్దకు పెద్ద ఎత్తున కస్టమర్స్ రావడంతో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో పోలీసులు కూడా ఈమెకు స్టాల్ తీసేయాలని సూచించారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటన పై స్పందించడంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది.

ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేశారు. అయితే త్వరలోనే ప్రసారం కాబోయే బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా కుమారీ ఆంటీ పాల్గొనబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈమె కూడా కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు పరోక్షంగా చెప్పకనే చెప్పేశారు..

పవన్ ఫ్యాన్స్..
బిగ్ బాస్ లో పాల్గొనబోయే ఈమె పల్లవి ప్రశాంత్ బాటలోనే పయనిస్తున్నారని తెలుస్తోంది. ఈయన కూడా రైతుబిడ్డ సింపతి డ్రామాలు ప్లే చేసి కప్పు కొట్టారు. ఇక కుమారి ఆంటీ సైతం వెనక పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించే విధంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు పవన్ కళ్యాణ్ ఫాన్స్ సపోర్ట్ చేయాలని కోరారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ అభిమానులను టార్గెట్ గా పెట్టుకొని ఈమె ఈసారి హౌస్ లోకి వెళ్లి కప్పు గెలుచుకోవాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి ఈమె ప్లాన్స్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతాయో తెలియాల్సి ఉంది.