Bigg Boss 8: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం తెలుగులో కూడా ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. త్వరలోనే ఎనిమిదవ సీజన్ కూడా ప్రసారం కాబోతోంది.
ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడి లేడీస్ కార్యక్రమం పూర్తి కాగానే బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలతో పాటు బుల్లితెర సెలబ్రిటీలను కూడా హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి యధావిధిగా నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. ఈయన మూడవ సీజన్ నుంచి ఇప్పటివరకు హోస్ట్ గా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా బిగ్ బాస్ 8 కోసం నాగార్జున రెమ్యూనరేషన్ కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. సీజన్ సెవెన్ కోసం నాగార్జున 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
వారంలో రెండు రోజులు..
ఇకపోతే సీజన్ 8 కోసం ఈయన ఏకంగా 30 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ నాగార్జున వారంలో కేవలం రెండు రోజులు మాత్రమే తెరపై కనిపిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…