Raghu Kunche: చిరంజీవి చెప్పినా కూడా మణిశర్మ వేరే సింగర్ తో పాట పాడించారని కోపంతో చిరంజీవి స్టూడియోకి వచ్చి ఎలా అరిచారంటే… : రఘు కుంచె

Raghu Kunche: రఘు కుంచె తెలుగు సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా పలు సినిమాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన సంగీత దర్శకుడి కంటే ముందుగా సింగర్ గా కూడా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. రఘు కుంచే పాడిన పాటలు అన్నీ కూడా ఎంతో మంచి హిట్ అందుకున్నాయి.

Raghu Kunche: మణిశర్మ ఆ చిన్న పని చేసినందుకు చిరంజీవి స్టూడియోకి వచ్చి గట్టిగా అరిచారు.. రఘు కుంచె షాకింగ్ కామెంట్స్!

ఇండస్ట్రీలో రఘు కుంచే ఎక్కువగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలో పాటలు పాడటం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేయడం జరిగింది.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రఘు కుంచె ఇండస్ట్రీలో పూరీతో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.

Raghu Kunche: మణిశర్మ ఆ చిన్న పని చేసినందుకు చిరంజీవి స్టూడియోకి వచ్చి గట్టిగా అరిచారు.. రఘు కుంచె షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే సంగీత దర్శకుడిగా తనకు దేవుడు చేసిన మనుషులు సినిమా ఎలాంటి పేరు తెచ్చిపెట్టిందో సింగర్ గా కూడా మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమా మంచి పేరు తెచ్చి పెట్టాయని తెలిపారు. మృగరాజు సినిమా కోసం మణి శర్మ గారు సంగీతం అందించారు. ఇంకా ఈ సినిమాలో పాటలన్నీ కూడా గొప్ప గొప్ప సింగర్లతో పాడించారు.

ఆ పాట తిరిగి పాడించారు..

ఈ సినిమాలో హంగామా హంగామా అనే పాట తన కన్నా ముందుగా కేకే గారు పాడాల్సి ఉంది.అయితే అతను అందుబాటులో లేకపోవడం వల్ల బాచి సినిమాలో నేను పాడిన పాటను మెగాస్టార్ చిరంజీవి గారికి వినిపించడంతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పాటను రఘుతో పాడించమని చెప్పారు. మెగాస్టార్ చెప్పినట్టుగానే ఆ పాట నాతో పాడించారు. అయితే చిరంజీవి గారికి తెలియకుండా తిరిగి ఈ పాటను కేకే గారితో పాడించారు. ఈ విషయం తెలిసి మెగాస్టార్ కి సమాచారం అందించాను. ఆ సమయంలో మెగాస్టార్ స్టూడియోకు వచ్చి కోపం ఆపుకోలేక అందరి పై గట్టి గట్టిగా అరిచారు. మెగాస్టార్ ఇలా అరిచేసరికి తిరిగి నేను పాడిన పాటని సినిమాలో పెట్టారు. ఈ పాట కూడా మంచి హిట్ అయిందని తెలిపారు.