Jayaprada: ఎన్టీఆర్ గారు రోడ్డుపై స్నానం చేయడం ఏంటీ.. ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన జయప్రద!
Jayaprada: తెలుగు సినిమా ఇండస్ట్రీలో విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు సినీ ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఒకవైపు ఇండస్ట్రీలో అగ్రహీరోగా కొనసాగుతూనే రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటూ ఒక ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రజల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. ఇప్పటికీ రాజకీయాలలో ఎన్టీఆర్ సేవలను కొనియాడుతూ ఉన్నారంటే ఆయన సేవలు ఏ స్థాయిలో ఉండేవో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆయనతో కలిసి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి రాజకీయాలలో కూడా తనతో కలిసి ప్రయాణం చేసిన నటి జయప్రద ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీ రామారావు గురించి ఈమె ఎన్నో విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు. ఎన్టీఆర్ గారి స్ఫూర్తి తోనే తాను ఇండస్ట్రీలోకి రాజకీయాలలోకి వచ్చానని ఆమె తెలియజేశారు. ఆయన ఇండస్ట్రీలో అగ్ర నటుడు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా కూడా ఎంతో చక్కగా బాధ్యతలను నిర్వర్తించారు. పేద ప్రజలను ఆర్థికంగా ముందుకు తీసుకురావాలని ఆయన ఎంతో తపన పడ్డారని జయప్రద ఈ సందర్భంగా తెలిపారు.
ఎన్టీ రామారావు గారి నుంచి మనం ఎన్నో గొప్ప విషయాలను తెలుసుకోవచ్చు. ఆయన అంత పెద్ద హోదాలో ఉండి కూడా గంజి అన్నం తినడం ఏంటి, రోడ్లపై పంపు కింద స్నానాలు చేయడం ఏంటి.. ఇవన్నీ చూసిన తర్వాత మనం కూడా ఇలాంటివి ఎందుకు చేయలేము.. ఆయనలా కాకుండా ఆయన నుంచి ఆయన డిసిప్లేన్, సింప్లిసిటీ, ఆయన సిన్సియారిటీని ఫాలో కావచ్చు అంటూ ఈమె సీనియర్ ఎన్టీఆర్ గురించి అతనితో తనకున్న అనుబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…