Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!
Jayaprada: సీనియర్ నటిగా, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో సినిమాలలో చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే జయప్రద ప్రస్తుతం బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన సినీ కెరీర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఎన్టీఆర్ గారు తన జీవితంలో ఒక రోల్ మోడల్ అని తెలిపారు.తనని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని అతని స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అతని నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని ఈమె తెలిపారు.
ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు పార్టీలో చేరమని ఎన్టీఆర్ ఫోన్ చేసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తాను తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశానని, ఎలాంటి పదవులు ఆశించి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని కేవలం ఎన్టీఆర్ గారిని సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని జయప్రద తెలియజేశారు.
అయితే ఇలా రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారిని వదిలి ఇతర ఎమ్మెల్యేలు బలవంతం మీద ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మేము చంద్రబాబుతో ఏకీభవిస్తున్నామని చెప్పడంతో నేను ఎన్టీఆర్ గారిని వదిలి చంద్రబాబుకు మద్దతు తెలిపాను. అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.ఎన్టీఆర్ గారు నా పై ఎంతో విశ్వాసం ఉంచి తనని పార్టీలోకి ఆహ్వానించగా నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉండాల్సిన సమయంలో ఉండకుండా బయటకు వచ్చానని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.
ఇకపోతే చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత తాను రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో ఉన్నానని ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు విలువ ఇవ్వడం అలాగే పార్టీ నేతలతో ప్రవర్తించే తీరులో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోవడంతో నేను ఆంధ్ర వదిలి రావాల్సి వచ్చిందని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…